News May 12, 2024

అక్కడ 10 మందే ఓటర్లు!

image

TG: రాష్ట్రంలోని మారుమూల తండాలు, గూడేల్లోని ఓటర్ల కోసం ఈసీ ఈసారి 328 ప్రాంతాల్లో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 61 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య 100లోపే ఉంది. నాగర్ కర్నూల్ లోక్‌సభ పరిధి అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంటులోని మన్ననూరులో అతితక్కువగా 10 మంది ఓటర్లుండగా, ఉప్పునుంతల, బక్కలింగాయపల్లిలో అత్యధికంగా 100 మంది ఓటర్లు ఉన్నారు.

Similar News

News December 4, 2025

టైర్లు ధ్వంసమైనా, నీటిలోనూ ప్రయాణం ఆగదు

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌ <<18465862>>పర్యటన<<>> వేళ ఆయన ప్రయాణించే “ఆరస్ సెనాట్” కారుపై చర్చ జరుగుతోంది. ఇది ప్రపంచంలో అత్యంత సురక్షిత వాహనాల్లో ఒకటి. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ కారు బాంబులు, క్షిపణి దాడులను సైతం తట్టుకుంటుంది. నీటిలో మునిగిపోయినా ఇది తేలి సురక్షిత ప్రాంతానికి చేర్చుతుంది. ప్రత్యేకంగా కస్టమైస్డ్‌ అయిన ఈ కారు ధర సుమారు రూ.5కోట్లు ఉంటుంది. ఇది సాధారణ పౌరులకు అందుబాటులో లేదు.

News December 4, 2025

వస్తువు కొనేముందు ఓ సారి ఆలోచించండి: హర్ష

image

అవసరమైన వస్తువులను మాత్రమే కలిగి ఉండే జీవనశైలిని అలవరుచుకోవాలని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా యువతకు సూచించారు. ‘మెరుగైన లైఫ్‌స్టైల్ కోసం ప్రయత్నిస్తూ చాలా మంది తమ మనశ్శాంతిని కోల్పోతున్నారు. విలాసంగా జీవించడం అంటే ఎక్కువ వస్తువులను కొనడం కాదు. తక్కువ వస్తువులు ఉంటే వాటి నిర్వహణ, శ్రమ కూడా తగ్గుతుంది’ అని అభిప్రాయపడ్డారు. అందుకే వస్తువులను కొనేముందు అవి నిజంగా అవసరమా అని ఆలోచించండి. SHARE IT

News December 4, 2025

ఆఫర్లను రద్దు చేసిన 20 సంస్థలపై IITల బ్యాన్

image

జాబ్ ఆఫర్ ఇచ్చి ఆపై రద్దు చేసిన 20కి పైగా సంస్థలను ప్లేస్‌మెంట్ల డ్రైవ్ నుంచి IITలు నిషేధించాయి. ఆ కంపెనీల చర్య విద్యార్థుల కెరీర్ ప్లానింగ్‌కు ఆటంకం కలిగించడంతో పాటు ఒత్తిడికి గురిచేయడమే దీనికి కారణం. ఇందులో డేటా అనలటిక్స్ కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఆఫర్ లెటర్లో ఇచ్చిన ప్యాకేజీని జాయినింగ్‌కు ముందు తగ్గించాయి. కంపెనీల ప్లేస్‌మెంట్ల హిస్టరీని పరిశీలిస్తున్నట్లు IIT ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.