News May 12, 2024
అక్కడ 10 మందే ఓటర్లు!

TG: రాష్ట్రంలోని మారుమూల తండాలు, గూడేల్లోని ఓటర్ల కోసం ఈసీ ఈసారి 328 ప్రాంతాల్లో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 61 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య 100లోపే ఉంది. నాగర్ కర్నూల్ లోక్సభ పరిధి అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంటులోని మన్ననూరులో అతితక్కువగా 10 మంది ఓటర్లుండగా, ఉప్పునుంతల, బక్కలింగాయపల్లిలో అత్యధికంగా 100 మంది ఓటర్లు ఉన్నారు.
Similar News
News February 10, 2025
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

TG: సెలవు దినాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టొద్దని హైడ్రాకు హైకోర్టు సూచించింది. శుక్రవారం నోటీసులిచ్చి, వివరణ ఇచ్చేందుకు శనివారం ఒక్కరోజే సమయమిస్తూ ఆదివారం కూల్చివేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి(D) అబ్దుల్లాపూర్మెట్(M) కోహెడలో నిర్మాణాల కూల్చివేతలపై నమోదైన పిటిషన్ను విచారించింది. వివరణ ఇచ్చేందుకు భవన యజమానులకు సహేతుకమైన సమయం ఇవ్వాలని పేర్కొంది.
News February 10, 2025
షమీ భాయ్.. ఇలా అయితే ఎలా?

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు IND బౌలర్ షమీ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్ స్థాయికి తగ్గట్లుగా రాణించడం లేదు. ENGతో తొలి ODIలో 8 ఓవర్లు వేసి 38/1తో ఫర్వాలేదనిపించినా, రెండో వన్డేలో 7.5 ఓవర్లకే 66 రన్స్ సమర్పించుకున్నారు. అనుకున్న లైన్, లెంగ్త్లో బౌలింగ్ చేయలేకపోతున్నారు. CTకి బుమ్రా దూరమయ్యే ఛాన్సున్న నేపథ్యంలో షమీ ఫామ్లోకి రావడం ముఖ్యమని విశ్లేషకులు అంటున్నారు.
News February 10, 2025
మంచి మాట – పద్యబాట

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: మనసు నిర్మలంగా లేనట్లయితే ఆచారాలు పాటించడం వల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రంగా లేని వంట, మనసు స్థిరంగా లేని శివ పూజ వ్యర్థాలే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.