News January 20, 2025
‘హిండెన్బర్గ్’ అండర్సన్పై మోసం కేసు నమోదుకు ఆస్కారం!

US షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ యజమాని అండర్సన్పై సెక్యూరిటీ ఫ్రాడ్ కేసు నమోదవ్వొచ్చని సమాచారం. కంపెనీలే టార్గెట్గా రిపోర్టులు రూపొందించేందుకు హెడ్జ్ఫండ్ కంపెనీలతో కుమ్మక్కైనట్టు ఆంటారియో కోర్టులో దాఖలైన పత్రాలు వెల్లడిస్తున్నాయి. షేర్ల ట్రేడింగులో పాల్గొంటున్నట్టు చెప్పకుండా బేరిష్ రిపోర్టులను రూపొందించడం US SEC ప్రకారం నేరమని ఆ నివేదిక నొక్కిచెప్పింది. అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారం తెలిసిందే.
Similar News
News February 17, 2025
IND-PAK మ్యాచ్పై ఓవర్హైప్: హర్భజన్

ఛాంపియన్స్ ట్రోఫీలో మిగతా అన్ని మ్యాచుల్లాగానే IND-PAK పోరు ఉంటుందని హర్భజన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే ఈ మ్యాచ్పై ఓవర్హైప్ నెలకొందని తెలిపారు. ‘భారత్ పటిష్ఠమైన జట్టు. పాకిస్థాన్ నిలకడలేమితో ఉంది. ఐసీసీ టోర్నీల్లో రెండు టీమ్ల నంబర్లను పోల్చి చూస్తే మీకే అర్థమవుతుంది’ అని పేర్కొన్నారు. కాగా ఇటీవల సొంత గడ్డపై జరిగిన ట్రైసిరీస్(PAK-NZ-SA)లో పాక్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
News February 17, 2025
సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ: స్వామి

AP: గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని A, B, C కేటగిరీలుగా హేతుబద్ధీకరిస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. సీనియర్ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలు రూపొందిస్తామన్నారు. ఈ ప్రక్రియలో కొందరిని తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మహిళా పోలీసుల విషయంలో శిశు సంక్షేమ, హోంశాఖలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
News February 17, 2025
‘ఛావా’ మూవీ.. 3 రోజుల్లోనే రూ.100 కోట్లు!

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ మూవీ 3 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు రూ.33 కోట్లు, రెండో రోజు రూ.39 కోట్లు, నిన్న మూడో రోజు రూ.45 కోట్లు కలెక్ట్ చేసినట్లు పేర్కొన్నాయి. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దూసుకెళ్తున్నాయి.