News July 24, 2024

పస లేదు.. అధికారపక్షమే.. ప్రతిపక్షమైన వేళ!

image

ఏపీ అసెంబ్లీ సమావేశాలు చప్పగా సాగుతున్నాయి. ప్రతిపక్షం లేకపోవడమే ఇందుకు కారణం. గత పదేళ్లలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయాంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్‌‌కూ వైసీపీ హాజరు కాలేదు. కీలకమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై ప్రతిపక్షం లేకుండానే చర్చ సాగింది. అధికారపక్ష సభ్యులే ప్రతిపక్షమై ప్రశ్నలు సంధించగా మంత్రులు సమాధానమివ్వడంతో చర్చల్లో పస కనిపించడం లేదు.

Similar News

News December 22, 2025

ప్రభాకర్ రావును విచారించనున్న సజ్జనార్!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కస్టోడియల్ విచారణలో ఉన్న ప్రభాకర్ రావును విచారించేందుకు CP సజ్జనార్ రెడీ అయినట్టు తెలుస్తోంది. ముందుగా ఛార్జిషీట్ వేసి తర్వాత కేసుతో సంబంధం ఉన్న వారందరినీ విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులను ACP, DCP, జాయింట్ సీపీ స్థాయి అధికారులే విచారించారు. కమిషనర్ స్థాయిలో ఉన్న సజ్జనార్ నిందితుడిని విచారించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

News December 22, 2025

యోగాతో ఒత్తిడి, మానసిక సమస్యలకు చెక్

image

యోగాతో మానసిక సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఉదయాన్నే చేసే యోగా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేస్తే లంగ్స్ హెల్తీగా ఉంటాయి. యోగా చేస్తే ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కోపం, ఆందోళన కంట్రోల్ అవుతాయి. ప్రశాంతంగా ఆలోచించే గుణం పెరుగుతుంది. చిన్న వయసు నుంచే యోగా నేర్పిస్తే పిల్లలకు ఆరోగ్యంతోపాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

News December 22, 2025

నాపై 109 కేసులున్నాయి కాబట్టే..: సంజయ్

image

ప్రజల కోసం చేసిన పోరాటాల వల్ల తనపై 109 కేసులు పెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఓ మెడికల్ కాలేజీ వార్షికోత్సవంలో తెలిపారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఇన్ని కేసులున్నాయా? అని అమిత్ షాను అడిగారని గుర్తు చేశారు. ‘అందుకే సంజయ్ కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రి అయ్యారు’ అని షా బదులిచ్చారని పేర్కొన్నారు. వైద్యులు ఫార్మా కంపెనీలు, డయాగ్నోస్టిక్ సెంటర్ల వలలో పడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు.