News January 28, 2025
సంపద సృష్టి లేదు.. సంపెంగ పువ్వూ లేదు: అంబటి ఎద్దేవా

AP: పథకాల అమలుపై సీఎం చంద్రబాబు చేసిన <<15282237>>కామెంట్లకు<<>> మాజీ మంత్రి అంబటి రాంబాబు Xలో కౌంటరిచ్చారు. ‘సంపద సృష్టి లేదు.. సంపెంగ పువ్వూ లేదు. జగన్ మీద తోసేసి చంద్రబాబు, లోకేశ్ చేతులెత్తేశారు. హామీలు గాలికి వదిలేశారు. గోవిందా.. గోవిందా!!’ అని ఎద్దేవా చేశారు. అప్పుల పేరుతో CBN పథకాలు అమలు చేయడం లేదని అంబటి నిన్న విమర్శించిన విషయం తెలిసిందే.
Similar News
News October 14, 2025
1,968 మంది టెర్రరిస్టులను తరలించాం: ఇజ్రాయెల్

గాజా పీస్ ప్లాన్లో భాగంగా తమ అధీనంలో ఉన్న 20 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్ల విడుదల ప్రక్రియను స్టార్ట్ చేసింది. ‘దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న 1,968 మంది టెర్రరిస్టులను ఓఫర్, కట్జియోట్ కేంద్రాలకు తరలించాం. అనుమతుల ప్రక్రియ ముగిశాక వారిని గాజాకు పంపిస్తాం’ అని అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
News October 14, 2025
SC వర్గీకరణ.. మీ సేవల్లో కొత్త సర్టిఫికెట్లు తీసుకోవచ్చు: మంత్రి

TG: అన్ని మీసేవ కేంద్రాలను కొత్తగా ఉపవర్గీకరించిన షెడ్యూల్ కుల గ్రూపులతో అప్డేట్ చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ చట్టం నవంబర్ 15-2025, జీ.ఓ.ఎంఎస్. నంబర్ 9(షెడ్యూల్ కులాల శాఖ, 14-04-2025) ప్రకారం ఈ వర్గీకరణ వ్యవస్థను అమలు చేశామన్నారు. ఇకపై ప్రజలు తమ వర్గానికి సరిపడే ధ్రువపత్రాలను సులభంగా పొందవచ్చని, SC, ST, BC క్యాస్ట్ సర్టిఫికెట్ల రీఇష్యూ సదుపాయాన్ని కూడా ప్రారంభించామన్నారు.
News October 13, 2025
అఫ్గాన్ ప్రభుత్వంలో మాకూ చోటివ్వాలి: మైనార్టీ ప్రతినిధులు

అఫ్గాన్లోని గురుద్వారాలు, టెంపుళ్ల మరమ్మతు, అభివృద్ధికి తోడ్పడాలని మైనార్టీ ప్రతినిధులు ఆదేశ విదేశాంగ మంత్రి ముత్తాఖీని ఢిల్లీలో విన్నవించారు. అక్కడి ప్రభుత్వంలోనూ హిందూ, సిక్కులకు చోటివ్వాలని కోరారు. ఆలయాల పునరుద్ధరణ, భద్రత, మైనార్టీలకు ఆస్తి హక్కు కల్పించడానికి ముత్తాఖీ హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. వాటిని సందర్శించడానికి రావాలని పిలిచారన్నారు. తాలిబన్ల రాకతో వారంతా ఇండియా వచ్చేశారు.