News March 29, 2024
మట్టి కుండలో నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!

ప్రస్తుతం వేసవికాలంలో ఫ్రిజ్లోని చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఫ్రిజ్కు బదులు మట్టి కుండలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. ఆ నీరు తాగితే గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. జిడ్డు, మొటిమల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.
Similar News
News March 30, 2026
అమ్మ అయ్యాక ఆడపులినైపోయా: కియారా అద్వానీ

తల్లికావడంతో జీవితాన్ని చూసే విధానమే మారిపోయిందని బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ చెప్పుకొచ్చారు. తాను ఆడపులిలా మారిపోయానని.. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు జీవితాన్ని చూసే కోణం భిన్నంగా ఉందన్నారు. ఒక్కోసారి ఏదీ ముఖ్యం కాదని అనిపిస్తుంటుందని.. మరికొన్నిసార్లు అన్నీ ముఖ్యమనే భావన కలుగుతుంటుందని అన్నారు. గత ఏడాది ‘గేమ్ ఛేంజర్’లో మెరిసిన కియారా త్వరలో ‘టాక్సిక్’తో వెండితెరపై అలరించనున్నారు.
News March 30, 2026
ఈ నేలలు వేరుశనగ, నువ్వుల సాగుకు అనుకూలం

వేరుశనగ: ఇసుకతో కూడిన గరప నేలలు శ్రేష్ఠం. చల్కా, ఎర్రగరప నేలలు కూడా అనుకూలం. ఎక్కువ బంక మట్టిగల నల్ల రేగడి నేలల్లో పంట వేయరాదు. నేల pH 6.5-7.0 ఉండి, 20-30 సెం.మీ లోతు వరకు దున్నడానికి వీలుగా ఉండాలి.
నువ్వులు: మురుగు నీరు నిలవని తేమ నిలిచే తేలికైన నేలలు అనుకూలం. నీరు నిలిచే ఆమ్ల, క్షార నేలలు పనికిరావు. ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు కూడా మంచి దిగుబడినిస్తాయి.
News March 30, 2026
ఐశ్వర్యానికి కారకుడు శివుడా?

శివుడిని వైరాగ్యానికి మూర్తిగా భావిస్తాం. కానీ ఆయనే సకల సంపదలకు మూలమైన ‘ఐశ్వర్యేశ్వరుడు’. కుబేరుడికి ఉత్తర దిక్పాలకుడిగా, సంపదలకు అధిపతిగా ఉండే శక్తిని ప్రసాదించినది ఆ పరమశివుడే. ఆయన భక్తుల దారిద్ర్యాన్ని హరించి శుభాలను చేకూర్చే మంగళకారుడు. మనసు నిండా భక్తితో శివుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహంతో దారిద్ర్య బాధలు తొలగి భోగభాగ్యాలు చేకూరుతాయి. అందుకే శివుణ్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటారు.


