News March 29, 2024
మట్టి కుండలో నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!

ప్రస్తుతం వేసవికాలంలో ఫ్రిజ్లోని చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఫ్రిజ్కు బదులు మట్టి కుండలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. ఆ నీరు తాగితే గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. జిడ్డు, మొటిమల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.
Similar News
News February 15, 2026
ప్రభాస్కు గాయం!

సినీ హీరో ప్రభాస్ గాయపడినట్లు సమాచారం. ఫౌజీ సినిమా షూటింగ్లో హార్స్ రైడ్ చేస్తుండగా ఆయనకు గాయమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో ఇవాళ షూటింగ్కు బ్రేక్ తీసుకున్నారని, రేపట్నుంచి మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటారని టాక్. హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కీలకదశలో ఉంది. అటు సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు.
News February 15, 2026
శివుడిని లయకారుడు అని ఎందుకు అంటారు?

సృష్టి, స్థితి, లయ అనే 3 కార్యాలలో శివుడు ‘లయకారుడు’. అంటే ఈ విశ్వాన్ని ఉపసంహరించేవాడు అని అర్థం. అయితే ఈ లయం ప్రతికూలమైనది కాదు. పాతది అంతమైతేనే కొత్త సృష్టికి మార్గం సుగమమవుతుంది. శివుడు తన తాండవంతో అజ్ఞానం, అహంకారాన్ని లయం చేసి, ఆత్మను దైవంలో విలీనం చేస్తాడు. మనలో చెడు ఆలోచనలను నశింపజేసి, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఆయనను సృష్టి చక్రంలో మార్పును తెచ్చే పరమాత్మగా పూజిస్తారు.
News February 15, 2026
ప్రపంచంలోనే తొలి ఇంజినీరింగ్ కాలేజీ.. ఎక్కడో తెలుసా?

ఇంజినీరింగ్ విద్యకు ఎంతో క్రేజ్ ఉంది. దానికి తగ్గట్లే ఎన్నో వర్సిటీలు ప్రపంచవ్యాప్తంగా వెలిశాయి. ఈ విద్యకు 300 ఏళ్ల కిందటే నాంది పడింది. JAN 18, 1707న చెక్ రిపబ్లిక్ రాజధాని అయిన ప్రేగ్లో చెక్ టెక్నికల్ వర్సిటీని రోమన్ చక్రవర్తి జోసెఫ్-1 స్థాపించారు. ఇదే వరల్డ్స్ ఫస్ట్ ఇంజినీరింగ్ వర్సిటీ. సైనిక కోటలు, మౌలిక సదుపాయాల నిర్మాణాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవారు. క్రమంగా దీన్ని విస్తరించారు.


