News March 22, 2024
పోటీలో ఉన్న తండ్రీ కొడుకులు వీరే..
AP: వచ్చే ఎన్నికల్లో తండ్రీకొడుకులు పోటీ చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం, లోకేశ్ మంగళగిరి బరిలో ఉన్నారు. మైదుకూరు TDP అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కొడుకు పుట్టా మహేశ్ యాదవ్ ఏలూరు ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడే మహేశ్. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు, ఆయన కుమారుడు సునీల్ యాదవ్ ఏలూరు YCP ఎంపీ అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకోనున్నారు.
Similar News
News October 2, 2024
మాతో ఘర్షణకు దిగొద్దు: ఇరాన్ అధ్యక్షుడు
తమ దేశ ప్రయోజనాలు, పౌరుల రక్షణ కోసమే ఇజ్రాయెల్పై క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తెలిపారు. ఈ దాడిని ఇజ్రాయెల్ దురాక్రమణకు ‘నిర్ణయాత్మక ప్రతిస్పందన’గా అభివర్ణించారు. ఇరాన్ యుద్ధభూమి కాదని, కానీ ఏదైనా ముప్పు ఉంటే దృఢమైన సంకల్పంతో దానికి వ్యతిరేకంగా నిలుస్తుందని అన్నారు. ఈ విషయం నెతన్యాహు తెలుసుకోవాలని, తమతో ఘర్షణకు దిగవద్దని ట్వీట్ చేశారు.
News October 2, 2024
రిషభ్ పంత్ సరదా మనిషి: లబుషేన్
టీమ్ ఇండియా ఆటగాళ్లందరిలోకీ భారత కీపర్ రిషభ్ పంత్ తనకు ఆసక్తికరంగా అనిపిస్తుంటారని ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అన్నారు. ‘పంత్ ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటారు. కానీ నిజాయితీగా ఆడతారు’ అని పేర్కొన్నారు. ఇక బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్తో ఏదో విధంగా ఆటను ప్రభావితం చేసే జడేజాను చూస్తే తనకు చిరాకు, అసహనం వస్తుందని మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సరదాగా వ్యాఖ్యానించారు.
News October 2, 2024
GREAT: కంటిచూపు లేకపోయినా..!
బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల ఆయేషా బాను పుట్టుకతోనే అంధురాలు. అయినప్పటికీ తన ఉన్నతమైన స్పర్శ భావాన్ని ప్రాణాలు కాపాడే సాధనంగా మలుచుకున్నారు. డిగ్రీ చదివినా ఉద్యోగం దొరక్క ఆమె చాలా ఇబ్బందులు పడ్డారు. సైట్కేర్ హాస్పిటల్స్లో మెడికల్ టాక్టైల్ ఎగ్జామినర్గా ఉద్యోగం పొంది ఎంతో మంది మహిళల ప్రాణాలు కాపాడారు. ‘మ్యాజిక్ ఫింగర్స్’ అనే స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా ఆమె రొమ్ము క్యాన్సర్ గడ్డలను గుర్తిస్తారు.