News March 22, 2024

పోటీలో ఉన్న తండ్రీ కొడుకులు వీరే..

image

AP: వచ్చే ఎన్నికల్లో తండ్రీకొడుకులు పోటీ చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం, లోకేశ్ మంగళగిరి బరిలో ఉన్నారు. మైదుకూరు TDP అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కొడుకు పుట్టా మహేశ్ యాదవ్ ఏలూరు ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడే మహేశ్. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు, ఆయన కుమారుడు సునీల్ యాదవ్ ఏలూరు YCP ఎంపీ అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకోనున్నారు.

Similar News

News November 22, 2025

తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఇంట్లో ఉండకూడదు: HC

image

తండ్రి పర్మిషన్ లేకుండా ఆయన ఇంట్లో కొడుకు ఉండటానికి వీల్లేదని రాజస్థాన్ హైకోర్టు తేల్చి చెప్పింది. సవాయ్ మాధోపూర్‌కు చెందిన ఖత్రీ, ఆయన కుమారుడికి మధ్య ఆస్తి వివాదంలో ఈ తీర్పిచ్చింది. తన బాగోగులు చూసుకోవడం లేదంటూ కొడుకు, కోడలిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఖత్రీ కోరారు. వివాదం పెద్దదై HCకి చేరింది. తానూ ఇంటి యజమానినేనంటూ కొడుకు వాదించాడు. తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఉండటానికి వీల్లేదని HC చెప్పింది.

News November 22, 2025

తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఇంట్లో ఉండకూడదు: HC

image

తండ్రి పర్మిషన్ లేకుండా ఆయన ఇంట్లో కొడుకు ఉండటానికి వీల్లేదని రాజస్థాన్ హైకోర్టు తేల్చి చెప్పింది. సవాయ్ మాధోపూర్‌కు చెందిన ఖత్రీ, ఆయన కుమారుడికి మధ్య ఆస్తి వివాదంలో ఈ తీర్పిచ్చింది. తన బాగోగులు చూసుకోవడం లేదంటూ కొడుకు, కోడలిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఖత్రీ కోరారు. వివాదం పెద్దదై HCకి చేరింది. తానూ ఇంటి యజమానినేనంటూ కొడుకు వాదించాడు. తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఉండటానికి వీల్లేదని HC చెప్పింది.

News November 22, 2025

తెలంగాణ డీసీసీలను ప్రకటించిన AICC

image

TG: రాష్ట్ర డీసీసీలకు కొత్త అధ్యక్షులను AICC ప్రకటించింది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలకు DCC పగ్గాలు దక్కాయి. ఆలేరు MLA బీర్ల ఐలయ్య, నాగర్ కర్నూల్‌కు వంశీ, నిర్మల్‌కు ఎమ్మెల్యే బొజ్జు, పెద్దపల్లికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కరీంనగర్‌కు మేడిపల్లి సత్యం, వనపర్తి DCCగా శాట్ ఛైర్మన్ శివసేనారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పైన ఫొటోలో DCCల పూర్తి వివరాలు చూడొచ్చు.