News December 2, 2024
ICC ఛైర్మన్లుగా పనిచేసిన భారతీయులు వీరే

ఐసీసీ నూతన చీఫ్గా జైషా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. 36 ఏళ్లకే ఆయన ఆ పదవి చేపట్టిన పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు. కాగా ఇంతకుముందు భారత్ నుంచి మరో నలుగురు ఐసీసీ ఛైర్మన్గా సేవలందించారు. వీరిలో జగ్మోహన్ దాల్మియా (1997-2000), శరద్ పవార్ (2010-2012), ఎన్ శ్రీనివాసన్ (2014-2015), శశాంక్ మనోహర్ (2015-2020) ఉన్నారు.
Similar News
News February 8, 2026
గతంలోనూ ప్రొద్దుటూరు టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు.!

ప్రొద్దుటూరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై గతంలోనూ పలుమార్లు షోకాజ్ నోటీస్, సస్పెన్షన్, ఎంక్వైరీలు జరిగాయి. అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనపై చర్యలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన ACPలు మునిరత్నం, మునిచంద్రశేఖర్, TPO శివగురుమూర్తి, TPSలు ఇందిర, శిరీషా తదితరులపై చర్యలు చేపట్టారు. ACB, విజిలెన్స్ విచారణలు జరిగాయి. ప్రస్తుత ACP నాగరాజును శుక్రవారం సస్పెండ్ చేశారు.
News February 8, 2026
ఐర్లాండ్ టార్గెట్ ఎంతంటే?

T20WC: ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక తడబడి నిలబడింది. తొలుత బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచినా మెండిస్ ద్వయం అదరగొట్టింది. 20 ఓవర్లలో 163/6 రన్స్ చేసింది. కుశాల్ మెండిస్(56), కమిందు మెండిస్(44), నిస్సంక(24) మాత్రమే రాణించారు. IRE బౌలర్లు జార్జ్, మెక్కార్తీ చెరో 2, మార్క్ అడైర్, డెలానీలు చెరో వికెట్ తీశారు. ఐర్లాండ్ 20 ఓవర్లలో 164 రన్స్ చేయాలి.
News February 8, 2026
రూ.100 కోట్లతో BJPని ఓడించాలనుకుంటున్నారు: బండి

TG: MIMతో BRS, కాంగ్రెస్ లాలూచీ పడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘కరీంనగర్ రావడానికి రేవంత్ భయపడి ఒవైసీని పంపారు. ఇక్కడ ఎన్నికలు ఇండియా-పాక్ మ్యాచ్లా ఉంటాయి. MIM, కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయి. రూ.100కోట్లు ఖర్చు పెట్టి BJPని ఓడించాలనుకుంటున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే. ఇక్కడ MIM గెలిస్తే ప్రజలను ఎవరూ కాపాడలేరు’ అని కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.


