News August 26, 2024

బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే.. కిషన్ రెడ్డికి చోటు

image

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం BJP స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాబితాలో ఉన్నారు. వీరితోపాటు కేంద్ర మంత్రులు గడ్కరీ, మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్, UP CM యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ CM భజన్ లాల్ శర్మ, సీనియర్ నేతలు అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీ ఉన్నారు.

Similar News

News November 16, 2025

వేరుశనగ పంట కోత.. ఇలా చేస్తే మేలు

image

వేరుశనగ పంటలో 75 నుంచి 80 శాతం కాయలు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే పంటను కోయాలి. పంటకోత కొరకు డిగ్గర్ యంత్రాన్ని, మొక్క నుంచి కాయలను వేరుచేయటానికి త్రైషర్ యంత్రాన్ని ఉపయోగిస్తే మంచిది. త్రైషర్ ద్వారా ఒక గంటకు 2 నుంచి 2 1/2 క్వింటాళ్ల కాయలను మొక్కల నుంచి వేరుచేయవచ్చు. ఇలా కూలీల కొరతను అధిగమించవచ్చు. కోత తర్వాత కాయలను బాగా ఆరబెట్టాలి. కాయల్లో తేమ ఎక్కువ లేకుండా చూసుకోవాలి.

News November 16, 2025

శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్

image

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు నదీస్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఆరోగ్యశాఖ సూచించింది. రాష్ట్రంలో అమీబిక్ మెనింజోఎన్‌సైఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నదీస్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. వేడి చేసిన నీటినే తాగాలని, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్ 04735 203232.

News November 16, 2025

‘ఇలా దీపం వెలిగిస్తే పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయి’

image

రావి ఆకుపై ప్రమిదను ఉంచి, అందులో నువ్వుల నూనె పోసి, దీపం వెలిగించడం ఎంతో శుభప్రదమని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో ఇలా దీపం వెలిగిస్తే.. పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘రావి చెట్టు ఎంతో పవిత్రమైనది. దీన్ని పూజిస్తే శాపాలు, దోషాలు, గత జన్మ కర్మలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇంట్లో సుఖశాంతులు, శ్రేయస్సు కలగడానికి ఈ దీపం పెట్టాలి’ అని సూచిస్తున్నారు.