News March 16, 2024
పవన్, లోకేశ్, బాలయ్యపై పోటీ చేసే YCP అభ్యర్థులు వీరే..
కొద్దిసేపటి క్రితం ప్రకటించిన YCP MLA అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశాలున్నాయి. ముగ్గురు ప్రముఖులపై మహిళలు పోటీ చేయనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక నారా లోకేశ్ (మంగళగిరి)కు పోటీగా లావణ్య, బాలకృష్ణ (హిందూపురం)కు TN దీపిక పోటీ ఇస్తారని YCP ప్రకటించింది.
Similar News
News October 2, 2024
కలల్ని రీప్లే చేసే పరికరం.. కనిపెట్టిన పరిశోధకులు
ఒక్కోసారి చాలా మంచి కల వస్తుంటుంది. మెలకువ వచ్చేస్తే అయ్యో చక్కటి కల డిస్టర్బ్ అయిందే అంటూ ఫీల్ అవుతుంటాం. ఇకపై అలా ఫీల్ కానక్కర్లేదు. మన మనసులో నడిచే కలను ఒడిసిపట్టి దాన్ని తిరిగి రీప్లే చేసే పరికరాన్ని బ్రెయిన్ ఇమేజింగ్, AI సాంకేతికతల సాయంతో జపాన్ పరిశోధకులు రూపొందించారు. పరిశోధనలో పాల్గొన్నవారు చెప్పిన కలలకు, పరికరం గుర్తించిన సమాచారానికి 60శాతం కచ్చితత్వం వచ్చిందని వారు తెలిపారు.
News October 2, 2024
దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్ మోగించిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని ఆ దేశ మిలిటరీ ప్రకటించింది. పౌరులు బాంబు షెల్టర్లకు దగ్గరగా ఉండాలని ఆదేశిస్తూ దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్లు మోగించింది. జెరూసలేం సహా ఇజ్రాయెల్ అంతటా ఈ సైరన్లు మోగించినట్లు పేర్కొంది. ఫోన్లు, TVల ద్వారా ప్రకటనలు జారీ చేసింది.
News October 2, 2024
రైతులకు శుభవార్త
తెలంగాణలో పామాయిల్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పామాయిల్ గెలల ధరను రూ.17,043కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో రైతులకు దసరా పండుగ ముందే వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పామాయిల్ రైతులకు అధిక ధరలు అందించి రాష్ట్రంలో సాగు లాభసాటి చేసి, అన్నదాతలను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తుమ్మల వెల్లడించారు.