News July 4, 2024
ఈ రెండు పరేడ్స్ ఎప్పటికీ చిరస్మరణీయమే..!

ముంబైలో టీమ్ ఇండియా విజయోత్సవ ర్యాలీకి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. లక్షలాదిగా తరలిరావడంతో ముంబై వీధులు సముద్రాన్ని తలపించాయి. ఇంతటి ప్రజాదరణ 2022లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ గెలిచినప్పుడు బ్యూనస్ ఎయిర్స్లో లభించింది. ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని చూసేందుకు అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో ఈ రెండు పరేడ్స్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని అభిమానులు అంటున్నారు.
Similar News
News March 17, 2026
బెంగాల్లో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదు: మమతా బెనర్జీ

బెంగాల్లో BJPకి గతం కంటే ఈసారి సీట్లు తగ్గుతాయని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఆటలాడినా ఆ పార్టీకి ఏ మాత్రం గెలిచే అవకాశం లేదన్నారు. ఈ ఎన్నికల్లో ‘బెంగాల్’ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదని ఎద్దేవా చేశారు. కాగా WBలో మొత్తం 294 సీట్లకు గాను TMC 291 చోట్ల పోటీ చేస్తోంది. 3 సీట్లను మిత్రపక్షం BGPMకు కేటాయించింది.
News March 17, 2026
‘ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే యుద్ధం’.. అమెరికా ఉన్నతాధికారి రాజీనామా

ఇరాన్తో యుద్ధం వేళ అమెరికా నేషనల్ కౌంటర్టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్.. ట్రంప్కు షాకిచ్చారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఇరాన్తో అమెరికా యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు. మన దేశానికి ఇప్పటికిప్పుడు ఇరాన్తో ఎలాంటి ముప్పు వచ్చే అవకాశం లేదు. కానీ ఇజ్రాయెల్, బలమైన అమెరికన్ లాబీ ఒత్తిడి వల్లే అమెరికా యుద్ధంలోకి దిగినట్లు స్పష్టం అవుతోంది’ అని పేర్కొన్నారు.
News March 17, 2026
IPL తొలి మ్యాచులకు హేజిల్వుడ్, కమిన్స్ దూరం!

IPL-2026 ప్రారంభంలో కొన్ని మ్యాచులకు AUS ప్లేయర్లు హేజిల్వుడ్, కమిన్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. RCBకి ప్రాతినిధ్యం వహిస్తున్న హేజిల్వుడ్ తొలి 2 మ్యాచులు ఆడకపోవచ్చని Cricbuzz పేర్కొంది. అటు SRH కెప్టెన్ కమిన్స్ కూడా IPLలో లేట్గా ఎంట్రీ ఇవ్వొచ్చని తెలిపింది. వీరిద్దరూ గాయాల కారణంగా కొన్ని నెలలుగా క్రికెట్కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా ఈనెల 28న జరిగే ఓపెనింగ్ మ్యాచులో RCB, SRH తలపడనున్నాయి.


