News July 3, 2024
అవన్నీ తప్పుడు ప్రచారాలే: టీటీడీ

AP: అన్న ప్రసాదాల తయారీకి సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపేయాలని TTD భావిస్తున్నట్లు వచ్చిన వార్తల్ని దేవస్థానం ఖండించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వ్యాప్తి అవుతున్నాయని స్పష్టం చేసింది. ‘స్వామివారికి నివేదించే అన్నప్రసాదాలు, వాటి దిట్టం గురించి ఈవో శ్యామలరావు సుదీర్ఘంగా చర్చించిన మాట వాస్తవం. అయితే వాటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తప్పుడు వార్తల్ని నమ్మొద్దు’ అని స్పష్టం చేసింది.
Similar News
News December 16, 2025
వెంకటేశ్ అయ్యర్కు రూ.7 కోట్లు

IPL-2026 మినీ వేలంలో వెంకటేశ్ అయ్యర్ను RCB రూ.7 కోట్లకు దక్కించుకుంది. గత మెగా వేలంలో ఇతడిని కోల్కతా రూ.23.75 కోట్లకు దక్కించుకుంది. మినీ వేలానికి ముందు రిలీజ్ చేసింది. దీంతో వేలానికి వచ్చిన అయ్యర్ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. అటు రూ.75 లక్షల బేస్ ప్రైస్ ఉన్న ఆల్రౌండర్ దీపక్ హుడా అన్సోల్డ్గా మిగిలారు.
News December 16, 2025
అసౌకర్యంగా అనిపిస్తుంది.. కాంతార ఇమిటేషన్పై రిషబ్ శెట్టి

కాంతార సీన్ను బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కామెడీగా <<18446778>>అనుకరించడం<<>>పై దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి పరోక్షంగా స్పందించారు. అలా చేయడం తనను అసౌకర్యానికి గురిచేస్తుందని రణ్వీర్ పేరెత్తకుండా చెప్పారు. ‘కాంతార దైవిక అంశాలతో రూపొందిన సినిమా. సున్నితమైన, పవిత్రమైన విషయం. దానితో మాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. అందుకే మూవీ సన్నివేశాలను ఇమిటేట్ లేదా ఎగతాళి చేయవద్దని కోరుతుంటా’ అని ఓ ఈవెంట్లో పేర్కొన్నారు.
News December 16, 2025
వంటింటి చిట్కాలు మీకోసం

* కూరల్లో పెరుగు వేసేటప్పుడు నేరుగా కలపకుండా, ఒక కప్పులో వేసి స్పూన్తో చిలికి వెయ్యాలి. అప్పుడే గ్రేవీ మొత్తానికి చిక్కదనం వస్తుంది.
* పాలు మాడకుండా ఉండాలంటే కాచే ముందు గిన్నెలో కొద్దిగా చన్నీరు పోసి వంపేయాలి.
* అల్లం, వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండాలంటే దాంట్లో కొద్దిగా ఉప్పు, కాస్త వేడి నూనె వేయాలి.
* గుడ్లు ఉడికించేటప్పుడు కాస్త నూనె వేస్తే పగలకుండా ఉంటాయి.


