News November 7, 2024
పీఎం విద్యాలక్ష్మి స్కీమ్కు వీరు అనర్హులు

ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత చదువులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించేందుకు కేంద్రం <<14544821>>పీఎం విద్యాలక్ష్మి<<>> పథకాన్ని ప్రకటించింది. ఇందులో రూ.7.5 లక్షల లోపు రుణాలకు 75% క్రెడిట్ గ్యారంటీ ఉంటుంది. రూ.10 లక్షల వరకు రుణాలకు 3% వడ్డీ రాయితీ వర్తిస్తుంది. అయితే వార్షిక ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉన్నవారికే స్కీమ్ వర్తిస్తుంది. ఇతర ప్రభుత్వ స్కాలర్షిప్లు, వడ్డీ రాయితీ పథకాలు పొందుతున్న వారు అనర్హులు.
Similar News
News December 20, 2025
‘రాజాసాబ్’ నుంచి త్వరలో మరో ట్రైలర్?

ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 27న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని, అదే ఈవెంట్లో రిలీజ్ ట్రైలర్ను విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ హారర్ కామెడీ ఫిల్మ్ జనవరి 9న థియేటర్లలోకి రానుంది.
News December 20, 2025
గుడికి వెళ్తే పాదరక్షలు ఎందుకు విప్పాలి?

ఆలయ పవిత్రతను కాపాడటానికి, శుచిని పాటించడానికి పాదరక్షలు బయటే వదిలేయాలి. అలాగే స్నానం చేసి కొత్త దుస్తులు ధరించాకే గుడికి వెళ్లాలి. ఎందుకంటే.. మనం ధరించే బట్టలు, పాదరక్షల ద్వారా ప్రతికూల శక్తులు గుడిలోనికి ప్రవేశించవచ్చు. దూర ప్రయాణం చేసి గుడికి వెళ్లినప్పుడు, కోనేటిలో స్నానం చేసి బట్టలు మార్చుకోవడం వలన బాహ్య అపవిత్రత తొలిగిపోయి, దైవ దర్శనానికి తగిన సానుకూల స్థితి లభిస్తుందని నమ్ముతారు.
News December 20, 2025
ప్రతిష్ఠాత్మక అవార్డు గెలుచుకున్న ఉపాసన

రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల తాజాగా ‘మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారామె. ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీతో ఉన్నందువల్ల ఈ పురస్కారాన్ని తీసుకునేందుకు వెళ్లలేకపోయానని తెలిపారు. ఈ గుర్తింపు మరింత ఎక్కువగా పనిచేయడానికి, తమ పరిమితులను అధిగమించడానికి ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.


