News November 7, 2024
పీఎం విద్యాలక్ష్మి స్కీమ్కు వీరు అనర్హులు

ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత చదువులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించేందుకు కేంద్రం <<14544821>>పీఎం విద్యాలక్ష్మి<<>> పథకాన్ని ప్రకటించింది. ఇందులో రూ.7.5 లక్షల లోపు రుణాలకు 75% క్రెడిట్ గ్యారంటీ ఉంటుంది. రూ.10 లక్షల వరకు రుణాలకు 3% వడ్డీ రాయితీ వర్తిస్తుంది. అయితే వార్షిక ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉన్నవారికే స్కీమ్ వర్తిస్తుంది. ఇతర ప్రభుత్వ స్కాలర్షిప్లు, వడ్డీ రాయితీ పథకాలు పొందుతున్న వారు అనర్హులు.
Similar News
News December 28, 2025
దీపూ దాస్ హత్యపై షాకింగ్ నిజాలు!

బంగ్లాలో దీపూ చంద్రదాస్ హత్య ఉదంతంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీపూపై తప్పుడు నిందలు వేసి కొట్టి చంపినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు NDTVతో చెప్పారు. మృతదేహాన్ని కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లి చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టారన్నారు. అసలు దీపూ ఏ మతాన్నీ విమర్శించలేదని అధికారులు తేల్చినట్లు చెప్పారు. హిందువు అనే కారణంతో, ఎదుగుతున్నాడనే అసూయతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారన్నారు.
News December 28, 2025
చలి మంట.. పసిపిల్లలు మృతి

చలి కాచుకోవడానికి గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన నలుగురు ఊపిరాడక చనిపోయిన ఘటన బిహార్లోని ఛాప్రాలో జరిగింది. మృతుల్లో ముగ్గురు పసిపిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నారు. గది తలుపులన్నీ మూసి ఉండటంతో బొగ్గుల నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ గదిని నింపేసింది. దీంతో ఆ గాలి పీల్చి వారు స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు తేల్చారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
News December 28, 2025
ప్రెగ్నెన్సీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

ప్రెగ్నెన్సీలో మహిళలు తరచుగా నీరసంగా, అలసిపోయినట్లు కనిపిస్తారు. అయితే ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగడం మంచిది కాదందటున్నారు నిపుణులు. అలసట, తలతిరగడం, కండరాల నొప్పి, బలహీనత, చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ సమస్యలను తగ్గించడానికి గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు, మాంసం, గింజలు, రేగుపండ్లు తినాలని చెబుతున్నారు.


