News November 7, 2024
పీఎం విద్యాలక్ష్మి స్కీమ్కు వీరు అనర్హులు

ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత చదువులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించేందుకు కేంద్రం <<14544821>>పీఎం విద్యాలక్ష్మి<<>> పథకాన్ని ప్రకటించింది. ఇందులో రూ.7.5 లక్షల లోపు రుణాలకు 75% క్రెడిట్ గ్యారంటీ ఉంటుంది. రూ.10 లక్షల వరకు రుణాలకు 3% వడ్డీ రాయితీ వర్తిస్తుంది. అయితే వార్షిక ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉన్నవారికే స్కీమ్ వర్తిస్తుంది. ఇతర ప్రభుత్వ స్కాలర్షిప్లు, వడ్డీ రాయితీ పథకాలు పొందుతున్న వారు అనర్హులు.
Similar News
News December 14, 2025
మోదీని తొలగించడమే కాంగ్రెస్ అసలు అజెండా: బీజేపీ

ప్రధాని మోదీని పదవి నుంచి దింపేయడమే కాంగ్రెస్ అసలు లక్ష్యమని BJP ఆరోపించింది. ఓట్ చోరీ పేరుతో ఆ పార్టీ చేపట్టిన ర్యాలీ అసలు అజెండా ఇప్పుడు బయటపడిందని విమర్శించింది. మోదీ పాలన ముగిసిపోతుందని కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంపై మండిపడింది. ‘కాంగ్రెస్ ర్యాలీ SIRకు వ్యతిరేకంగా కాదు. మోదీని పదవి నుంచి తొలగించడానికే. తమ ప్రియతమ నాయకుడిని అగౌరవపరిస్తే ప్రజలు సహించరు’ అని హెచ్చరించింది.
News December 14, 2025
15,762 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 15,762 (పెంచిన తరువాత) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. KVSలో 9,921, NVSలో 5841 పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇప్పటికే రెండు సార్లు గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. సైట్: https://www.cbse.gov.in/
News December 14, 2025
నదీజలాలపై కేసీఆర్ ప్రత్యక్ష పోరాటం: BRS

TG: కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 19న BRSLP, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో కృష్ణా-గోదావరి నదులపై కేసీఆర్ సర్కార్ పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చర్చ జరుగుతుందని BRS వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం జలాలను కొల్లగొడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేకపోతోందని విమర్శించింది. దీనిపై ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని కేసీఆర్ భావిస్తున్నట్లు పేర్కొంది.


