News January 9, 2025
వాళ్లు పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్స్.. శివసేన ఎంపీ ట్వీట్కు మస్క్ రిప్లై
UKలో గ్రూమింగ్ <<15106970>>గ్యాంగ్స్<<>> ఆగడాలు హాట్టాపిక్గా మారాయి. వీళ్లంతా ఆసియా గ్యాంగ్స్ అని పలువురు చేస్తున్న ఆరోపణలను శివసేన(UBT) MP ప్రియాంకా చతుర్వేది ఖండించారు. వాళ్లు పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని ట్వీట్ చేయగా ఎలాన్ మస్క్ ‘నిజం’ అని రిప్లై ఇచ్చారు. గతంలో PAK మూలాలున్న వ్యక్తి ఓల్డ్ హోమ్లో లైంగికంగా వేధిస్తే అప్పటి ప్రాసిక్యూటర్, ప్రస్తుత PM కీర్స్టార్మర్ పట్టించుకోలేదని మస్క్ ఆరోపించారు.
Similar News
News January 14, 2025
గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధిస్తాం: CM
TG: ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు దావోస్లో పర్యటించబోతున్నట్లు CM రేవంత్ వెల్లడించారు. సింగపూర్లో స్కిల్ వర్సిటీతో ఒప్పందాలు, ఇతర పెట్టుబడులపై సంప్రదింపులు జరుపుతామన్నారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటామని చెప్పారు. గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధించడమే తమ లక్ష్యమన్నారు. గత ఏడాది దావోస్లో ₹40,232 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు.
News January 14, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ పబ్లిక్ టాక్
వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం యూఎస్లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమాలో కామెడీ అదిరిపోయిందని, వెంకీ నటన ఇరగదీశారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. స్టోరీ అంతగా లేదని, లాజిక్స్ వెతకకుండా చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పిస్తుందని చెబుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.
News January 14, 2025
నాలుగు పథకాలకు రూ.45వేల కోట్లు: భట్టి
TG: రాష్ట్రంలో కొత్తగా తీసుకురానున్న 4 సంక్షేమ పథకాల కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వీటిలో ఇందిరమ్మ ఇళ్లకు రూ.22,500 కోట్లు, రైతు భరోసాకు రూ.18వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.