News March 30, 2024

పార్టీలో చేర్చుకోలేదని ఏదేదో మాట్లాడుతున్నారు: కోమటిరెడ్డి

image

TG: కాంగ్రెస్‌లో తాను ఏక్‌నాథ్ షిండే అవుతానంటూ BJP MLA మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటరిచ్చారు. ‘నాపై ఆయన చేసిన వ్యాఖ్యలు సత్యదూరమైనవి. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌లో చేరతానని ఆయనే అడిగారు. మాకు మెజార్టీ ఉంది కాబట్టి అవసరం లేదని చెప్పా. పార్టీలో చేర్చుకోలేదని ఏదేదో మాట్లాడుతున్నారు. అమిత్ షా, గడ్కరీ వద్దకు వెళ్లి ఏదో చెప్పానని అంటున్నారు’ అని మండిపడ్డారు.

Similar News

News January 15, 2025

40కి పైగా క్షిపణులు, 70 డ్రోన్లు.. ఉక్రెయిన్‌పై దాడి పెంచిన రష్యా

image

ఉక్రెయిన్‌పై రష్యా మరో భారీ క్షిపణి దాడి చేసింది. 40కి పైగా క్షిపణులు, 70 డ్రోన్లు ఉపయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ముందస్తు విద్యుత్ కోతలు అమలు చేసినట్టు తెలిపారు. ఉక్రెయిన్ సైన్యానికి యుద్ధంలో ఉప‌క‌రిస్తున్న‌ గ్యాస్, ఎనర్జీ స‌దుపాయాలే ల‌క్ష్యంగా ర‌ష్యా ఈ దాడి చేసింది. కాగా, ఉక్రెయిన్‌కు జర్మనీ మరో 60 Anti-Aircraft Missiles పంప‌నుంది.

News January 15, 2025

EX కానిస్టేబుల్ అక్రమాస్తులు రూ.500 కోట్లు.. భోపాల్‌లో పొలిటికల్ వార్

image

MP భోపాల్‌లో 2024 DEC 19న ఓ కార్ నుంచి 52KGల గోల్డ్, ₹10Cr నగదును IT అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం RTO మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మదిగా గుర్తించి ఇంట్లో సోదాలు చేయగా ₹500-700Cr అక్రమాస్తులు బయటపడ్డాయి. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. BJP ప్రభుత్వంలో అవినీతికి ఇదే నిదర్శనమని INC విమర్శిస్తోంది. అయితే 15 నెలల కమల్‌నాథ్ సర్కార్ కరప్షన్‌కు మారుపేరని కమల నేతలు కౌంటరిస్తున్నారు.

News January 15, 2025

‘కుంభమేళా’పై స్టీవ్ జాబ్స్ లేఖ.. వేలంలో రూ.4.32 కోట్లు

image

భారత్‌లో జరిగే మహాకుంభమేళా అంటే యాపిల్ కో ఫౌండర్, దివంగత స్టీవ్ జాబ్స్‌కు ఎంతో ఇష్టం. ఆయన 19 ఏళ్ల వయసు(1974)లో తన ఆధ్యాత్మిక, ఆత్మ పరిశీలనతోపాటు కుంభమేళాను సందర్శించాలనే ఆకాంక్షను ప్రస్తావిస్తూ స్నేహితుడు టిమ్ బ్రౌన్‌కు లేఖ రాశారు. తర్వాత స్టీవ్ భారత్‌లో దాదాపు 7 నెలలు గడిపారు. 50 ఏళ్ల కిందటి ఈ లెటర్‌ను వేలం వేయగా దాదాపు రూ.4.32 కోట్లు పలికింది. తాజాగా ఆయన సతీమణి పావెల్ కుంభమేళాకు వచ్చారు.