News January 9, 2025
నన్ను జైలులో పెట్టాలని చూస్తున్నారు: KTR
TG: తనను జైలులో పెట్టించాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని KTR ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నన్ను జైలులో పెట్టించాలని చూస్తే, అది రేవంత్ కర్మ. ఏసీబీ అధికారులు 80కి పైగా ప్రశ్నలు అడిగారు. అడిగినవే మళ్లీమళ్లీ అడిగారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని సీఎంను అడిగా. లైవ్లో చర్చిద్దామని చెప్పా. జూబ్లీహిల్స్లోని రేవంత్ ఇంట్లో అయినా నేను సిద్ధమే’ అని సవాల్ విసిరారు.
Similar News
News January 23, 2025
భార్యను ముక్కలుగా నరికిన భర్త.. కారణం ఇదే!
TG: జిల్లెలగూడలో మాధవి <<15230164>>హత్య కేసులో<<>> పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన మాధవి సంక్రాంతికి పుట్టింటికి వెళ్తానని అడగ్గా భర్త గురుమూర్తితో గొడవ జరిగిందని చెప్పారు. ఆ కారణంతోనే భార్యను చంపినట్లు భావిస్తున్నారు. డెడ్ బాడీని ముక్కలుగా నరికి, కుక్కర్లో ఉడికించి చెరువులో పడేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణలో వెల్లడించాడు. గురుమూర్తికి వేరే మహిళతో సంబంధం ఉందని కూడా అనుమానిస్తున్నారు.
News January 23, 2025
త్వరలోనే రాష్ట్రానికి కాగ్నిజెంట్: లోకేశ్
AP: ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే శుభవార్త రాబోతుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దావోస్లో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో ఆయన సమావేశమయ్యారు. ‘రాష్ట్రంలోని వైజాగ్, విజయవాడ, తిరుపతిలో భారీగా కోవర్కింగ్ స్పేస్ ఉంది. కాగ్నిజెంట్ విస్తరణలో భాగంగా ఇక్కడ కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరాం. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆ సంస్థ సీఈఓ తెలిపారు’ అని పేర్కొన్నారు.
News January 23, 2025
ఓలా, ఉబర్ సంస్థలకు కేంద్రం నోటీసులు
క్యాబ్ బుక్ చేసుకునేవారికి మొబైల్ ఫోన్ల ఆధారంగా ఛార్జ్ వేస్తున్నారనే <<15225725>>ఫిర్యాదులపై<<>> కేంద్రం చర్యలకు దిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఓలా, ఉబర్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఒకే రకమైన సేవకు వేర్వేరు ఛార్జీలు వసూలు చేయడంపై స్పందించాలని కోరింది. ఐఫోన్లో రైడ్ బుక్ చేస్తే ఒకలా, ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే ఇంకొకలా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.