News February 5, 2025
వాళ్లంతా కుంభమేళాకు వెళ్లి చచ్చిపోవాలి: ఎంపీ పప్పూ

బిహార్కు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ లోక్సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారందరికీ మోక్షం దక్కిందని ఓ బాబా అన్నారని.. దాన్ని బట్టి రాజకీయ నాయకులు, ధనవంతులు, బాబాలు త్రివేణీ సంగమంలో మునిగి చనిపోవాలని సూచించారు. వారికి మోక్షం వస్తుందని ఎద్దేవా చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వందలాది మందిని దహన సంస్కారాలు లేకుండా తీసిపారేశారని పప్పూ ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


