News February 5, 2025

వాళ్లంతా కుంభమేళాకు వెళ్లి చచ్చిపోవాలి: ఎంపీ పప్పూ

image

బిహార్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్ లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారందరికీ మోక్షం దక్కిందని ఓ బాబా అన్నారని.. దాన్ని బట్టి రాజకీయ నాయకులు, ధనవంతులు, బాబాలు త్రివేణీ సంగమంలో మునిగి చనిపోవాలని సూచించారు. వారికి మోక్షం వస్తుందని ఎద్దేవా చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వందలాది మందిని దహన సంస్కారాలు లేకుండా తీసిపారేశారని పప్పూ ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News February 18, 2026

మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకుంటే…

image

TG: పరిషత్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో చిక్కొచ్చి పడింది. మార్చి 15లోపు ఎలక్షన్స్ నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు మురిగిపోనున్నాయి. అంతకుముందు నిర్వహిద్దామంటే టెన్త్ ప్రీఫైనల్స్‌, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంతో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సర్కార్ తర్జనభర్జన పడుతోంది. ఈ నెల 23న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయానికి రానుంది.

News February 18, 2026

25,487పోస్టులు.. పరీక్ష వాయిదా

image

CAPFS, SSF, అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న 25, 487 కానిస్టేబుల్ (<>GD<<>>) పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 23న పరీక్ష జరగాల్సి ఉండగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. త్వరలో పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. పరీక్షకు 8/10రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు, 2/3రోజుల ముందు అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. వెబ్‌సైట్: https://ssc.gov.in/

News February 18, 2026

భారీగా పెరిగిన అరటి ధరలు.. గెల ఎంతంటే?

image

AP: అరటి ధరలకు రెక్కలొచ్చాయి. JAN వరకు కర్పూర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, ఎర్ర చక్కెరకేళి గెల ₹200-300 ఉండేది. ఇప్పుడు ₹700-1000కి పెరిగింది. ఏప్రిల్ వరకు ఇవే ధరలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి తూ.గో, ప.గో జిల్లాల్లో అరటిని ఎక్కువగా సాగు చేస్తారు. గత 3ఏళ్లుగా తక్కువ ధరలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు రావడంతో సాగు విస్తీర్ణం తగ్గింది. డిమాండ్‌కు తగ్గట్లు అరటి మార్కెట్లోకి రావట్లేదు.