News January 23, 2025

దొడ్డు బియ్యం అమ్ముకునేవారు.. మేం సన్నబియ్యం ఇస్తాం: మంత్రి

image

TG: గతంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డులకు దొడ్డు బియ్యం ఇచ్చేవారని, తాము ప్రతి ఒక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఇవ్వబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యానికి ఏటా రూ.7వేల కోట్లు ఖర్చు చేసేదని, అయినా ఆ దొడ్డు బియ్యాన్ని ఎవరూ తినకపోయేవారని చెప్పారు. వాటిని లబ్ధిదారులు బయట అమ్ముకునేవారని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.

Similar News

News February 8, 2025

ముచ్చటగా మూడోసారా..? లేక 27 ఏళ్ల తర్వాత అధికారమా?

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో అక్కడి ఫలితంపై ఆసక్తి నెలకొంది. రాజధానిలో గడచిన 2సార్లూ ఆప్‌దే అధికారం. ముచ్చటగా మూడోసారీ గెలిచి అధికారంలోకి వస్తామని ఆప్ భావిస్తుంటే.. 27 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీని ఈసారి చేజిక్కించుకుంటామని బీజేపీ నమ్మకంగా చెబుతోంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీవైపే మొగ్గు చూపుతున్నాయి. మరి ఢిల్లీ ఓటరు మనోగతం ఎలా ఉందో నేటి సాయంత్రం లోపు తేలనుంది.

News February 8, 2025

నేడే CCL ప్రారంభం.. గ్రౌండులో సత్తా చాటనున్న సినీ స్టార్లు

image

సెలబ్రిటి క్రికెట్ లీగ్(CCL) 11వ సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. మ.2 గంటలకు బెంగళూరు వేదికగా చెన్నై రైనోస్VSబెంగాల్ టైగర్స్, సా.6 గంటలకు తెలుగు వారియర్స్‌VSకర్ణాటక బుల్డోజర్స్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 2 వ‌ర‌కు ఈ టోర్నీ కొనసాగనుంది. తెలుగు, త‌మిళ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన స్టార్లు బ్యాట్, బంతితో సత్తా చాటనున్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో HYDలో నాలుగు మ్యాచులున్నాయి.

News February 8, 2025

రాహుల్‌ గాంధీతో నాకు విభేదాల్లేవు: సీఎం రేవంత్

image

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తనకు అగాథమేర్పడిందన్న వార్తల్ని సీఎం రేవంత్ కొట్టిపారేశారు. ఆయన తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ‘మధ్యప్రదేశ్‌ సభలో తెలంగాణ CM బాగా చేస్తున్నాడంటూ కొనియాడారు. కులగణనపై ఆయనతో చర్చిస్తూనే ఉన్నాం. ఆయన ఆమోదం లేకుండా చేస్తామా..? రాహుల్‌తో నా సాన్నిహిత్యం ఎలాంటిదో ప్రపంచానికి చెప్పాల్సిన పనిలేదు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!