News October 15, 2025

నైవేద్యం సమర్పించేటప్పుడు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు

image

నైవేద్యం పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. స్వామి నైవేద్యం కోసం వండిన పదార్థాన్ని విడిగా తీసి పెట్టకుండా, పెట్టే పాత్రలో నిండుగా ఉంచాలి. నైవేద్య నివేదన తర్వాత నీళ్లు పెట్టడం అస్సలు మరవొద్దు. వీలైనంత ఎక్కువ సమయం నైవేద్యాన్ని స్వామివారి సన్నిధిలో ఉంచడం శుభకరం. నైవేద్య పదార్థాలలో బెల్లంతో వండిన వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం శ్రేయస్కరం. ఈ నియమాలు భక్తిని, శుచిని తెలియజేస్తాయి. <<-se>>#POOJA<<>>

Similar News

News October 15, 2025

గుండెపోటుతో గోవా మాజీ సీఎం కన్నుమూత

image

గోవా మాజీ సీఎం, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి రవి నాయక్(79) కన్నుమూశారు. ఇంట్లో నిన్న రాత్రి ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాత్రి ఒంటిగంట సమయంలో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇవాళ 3PMకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నాయక్ మృతి పట్ల పీఎం మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాసేవకు జీవితం అంకితం చేశారని కొనియాడారు.

News October 15, 2025

రబీలో మేలైన ‘కంది’ రకాలివే..

image

తెలుగు రాష్ట్రాల్లో వర్షం, నీటి సదుపాయాన్ని బట్టి రబీలో కందిని ఈ నెలాఖరు వరకు సాగుచేసుకోవచ్చు. TGలో WRG-65, WRG-53, WRG-255, TDRG-59, LRG-41, ICPL-87119, ICPH-2740, TDRG-4 రకాలు అనువుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఎకరానికి 5-6KGలు విత్తుకోవచ్చని తెలిపారు. ఆఖరి దుక్కిలో 20KGల నత్రజని, 50KGల భాస్వరంను వేయాలి, పైరు 30-40 రోజుల మధ్యలో మరో 20KGలను పైపాటుగా వేయాలని సూచిస్తున్నారు.
#ShareIt

News October 15, 2025

ఈ అష్టకం చదివితే కష్టాలు దూరం

image

నమామీశ్వరం సచ్చితానందరూపం
లసత్కుండలం గోకులే భ్రాజమానం|
యశోభియోలూఖలాద్దావమానం
పరామృష్ఠమత్యంతతో ధృత్యగోప్యా ||”
​ఈ దామోదరాష్టకాన్ని రోజూ పఠిస్తే కృష్ణుడి కృప లభిస్తుందని పండితులు చెబుతున్నారు. భక్తుల బాధలు, పాపాలు తొలగి, స్వామివారి అనుగ్రహం ఉంటుందని అంటున్నారు. మోక్షానికి మార్గమైన ఈ స్తోత్ర పారాయణ కష్టాలను తొలగిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. <<-se>>#SHLOKA<<>>