News May 19, 2024
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్

TG: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. భువనగిరిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చేసిన పనిని చెప్పుకోకపోవడమే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి కారణమని పేర్కొన్నారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.
Similar News
News November 26, 2025
భారత్ చెత్త రికార్డు

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో ఓడిన టీమ్ ఇండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్టు క్రికెట్లో రన్స్ పరంగా భారత్కు ఇదే అతిపెద్ద పరాజయం. 2004లో 342(vsAUS), 2006లో 341(vsPAK), 2007లో 337(vsAUS), 2017లో 333(vsAUS) పరుగుల తేడాతో IND ఓడిపోయింది. తాజా ఓటమితో WTC 2025-27 సీజన్లో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. తొలి 4 స్థానాల్లో ఆసీస్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాక్ ఉన్నాయి.
News November 26, 2025
ధర్మబద్ధమైన మార్గంలో నడిపించే నామం

విష్ణుం జిష్ణు మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ |
అనేకరూప దైత్యాన్తం నమామి పురుషోత్తమమ్ ||
జయశీలుడు, విశ్వమంతా వ్యాపించినవాడు, మహేశ్వరుడు, అనేక రూపాలలో దుష్టులను సంహరించినవాడు, ఉత్తమ పురుషుడైన ఆ విష్ణు దేవునికి భక్తితో నమస్కరించాలని ఈ శ్లోకం చెబుతోంది. ఫలితంగా శ్రీవారి అనుగ్రహంతో అనేక కష్టాలు, సవాళ్లను జయిస్తామని ప్రతీతి. ఈ విష్ణునామం మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 26, 2025
RRCATలో 150 పోస్టులు.. అప్లైకి ఇవాళే ఆఖరు తేదీ

రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ(<


