News August 4, 2024
ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది: ఈటల

TG: 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులతో అడ్డదారిన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కాక రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని BJP MP ఈటల రాజేందర్ ఆరోపించారు. శంషాబాద్లో ఏర్పాటు చేసిన BJP కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. హామీలన్నీ నీటి మీద రాతలయ్యాయన్నారు.
Similar News
News December 14, 2025
కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా ఏపీ: బొత్స

AP: ఆరోగ్యంగా ఉన్న ఏపీ కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా దూసుకుపోతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘18 నెలల వ్యవధిలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో సంక్షేమ పథకాల ఖర్చుకు రూ.3.45 లక్షలు కోట్లు అప్పు చేశాము. అయితే కూటమి ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియదు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక ఈ ప్రభుత్వం రైతులను కష్టపెడుతుంది’ అని ఫైరయ్యారు.
News December 14, 2025
డిసెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

✤ 1799: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ మరణం
✤1924: బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ జననం
✤ 1978: నటి సమీరా రెడ్డి జననం
✤ 1982: దక్షిణాది నటుడు ఆది పినిశెట్టి జననం
✤ 1984: నటుడు రానా జననం(ఫొటోలో)
✤ 2014: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు పీజే శర్మ మరణం
✤ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
✤ అంతర్జాతీయ కోతుల దినోత్సవం
News December 14, 2025
మూవీ ముచ్చట్లు

* బిగ్ బాస్ తెలుగు సీజన్-9 నుంచి కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్. ఇవాళ మరొకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్!
* ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ రిలీజ్ డేట్(జనవరి 9)లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్
* అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ‘డెకాయిట్’ మూవీ టీజర్ ఈ నెల 18న విడుదల.. వచ్చే ఏడాది మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమా


