News January 25, 2025

ఇది దేశం గర్వించదగిన సందర్భం: రాష్ట్రపతి

image

రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఈ గణతంత్ర దినోత్సవం ప్రత్యేకమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఇది యావత్ దేశం గర్వించదగిన సందర్భమన్నారు. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ చాలా ఎదిగిందని వివరించారు. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని అందరూ స్మరించుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అణుగుణంగా కొత్త చట్టాలను రూపొందించి అమల్లోకి తెచ్చామని ఆమె గుర్తుచేశారు.

Similar News

News October 15, 2025

సాయంకాలం నిద్రపోతున్నారా?

image

పగలు ముగిసి, రాత్రి మొదలయ్యే సమయంలో దేవతలందరూ శివ తాండవ వీక్షణలో తన్మయత్వం పొందుతూ ఉంటారు. అందువల్ల దైవ రక్షణ ప్రభావం కొంత మేర తగ్గుతుంది. ఈ అవకాశాన్ని అసుర శక్తులు వాడుకుంటాయి. ప్రజలను బాధించడానికి నిద్ర రూపంలో మనలోకి ప్రవేశించాలని చూస్తాయి. ఈ బలహీనతలకు మనం లొంగితే ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ వేళలో నిద్ర పోవద్దని పెద్దలు అంటుంటారు. * మరిన్ని ధర్మ సందేహాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 15, 2025

రూ.1కే రీఛార్జ్.. 30 రోజుల పాటు ఫ్రీ కాల్స్, ఇంటర్నెట్

image

దీపావళి సందర్భంగా కొత్త యూజర్లకు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL బంపరాఫర్ ప్రకటించింది. రూ.1కే 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2 జీబీ డేటా, 100 SMSలు అందించనున్నట్లు పేర్కొంది. సిమ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ‘BSNL దీపావళి బొనాంజా’ ఆఫర్ నేటి నుంచి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుందని Xలో వెల్లడించింది.

News October 15, 2025

మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు సిద్ధం: ఉత్తమ్

image

TG: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు తలెత్తితే 1800-425-00333/1967 హెల్ప్ లైన్ నంబర్‌కి ఫోన్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రైతులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 నుంచి 72 గంటల్లో నగదు చెల్లింపు చేయాలని అధికారులతో సమీక్షలో ఆదేశించారు. ఈ సీజన్‌లో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.