News December 11, 2024
ఇది మరో ‘పూనమ్ పాండే స్టంట్’!

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్పై 2024 బడ్జెట్లో కేంద్రం ప్రకటన చేసింది. అనంతరం ఈ వ్యాధితో నటి పూనమ్ పాండే మృతి చెందినట్టు ఆమె టీం ప్రకటించడం సంచలనమైంది. అయితే అదో స్టంట్గా తేలింది. అలాగే సంస్థలో ఉద్యోగుల ఒత్తిడిపై అవగాహన కల్పించడానికే ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేశామని <<14840427>>Yes Madam<<>> ప్రకటించింది. ఇది మరో ‘పూనమ్ పాండే స్టంట్’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
Similar News
News December 13, 2025
టమాటాలో బొడ్డు కుళ్లు/ పూత వైపు కుళ్లు నివారణకు సూచనలు

టమాటా అభివృద్ధి చెందే దశలో నీటి ఎద్దడి, మొక్కల్లో కాల్షియం లోపం వల్ల బొడ్డు కుళ్లు కనిపిస్తుంది. నత్రజని, నేలలో కరిగే పోటాషియం, మెగ్నిషియం ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు నేలలో తేమ హెచ్చుతగ్గులు కాకుండా చూసుకోవాలి. భూమిలో తగినంత కాల్షియం ఉండేట్లు చూసుకోవాలి. పైరు కోత దశలో కాల్షియం నైట్రేట్ 7.5-10 గ్రాములు లేదా కాల్షియం క్లోరైడ్ 4 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News December 13, 2025
కోల్కతాలో ఉద్రిక్తత.. HYDలో పోలీసుల అలర్ట్

మెస్సీ టూర్ సందర్భంగా కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో HYDలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఫ్యాన్స్ గ్రౌండ్లోకి రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఇవాళ సాయంత్రం ఇక్కడ మెస్సీ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. అటు సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానులు టెంట్లు, ఫ్లెక్సీలు, కుర్చీలను <<18551215>>ధ్వంసం చేశారు<<>>. పోలీసులు వారిని చెదరగొట్టారు.
News December 13, 2025
తిరుమలలో పరకామణి మీకు తెలుసా?

తిరుమలలో భక్తులు హుండీలో సమర్పించే మొక్కుబడులు, కానుకలను లెక్కించే ప్రదేశమే ‘పరకామణి’. పూర్వం ఇది శ్రీవారి ఆలయం లోపల, ఆనంద నిలయం వెనుక ఉండేది. ప్రస్తుతం భద్రత, సాంకేతిక పరిజ్ఞానంతో, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం ఎదురుగా పరకామణి భవనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వేలాది మంది భక్తులు సమర్పించిన కోట్ల రూపాయల కానుకల లెక్కింపు నిరంతరం జరుగుతూ ఉంటుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>


