News December 11, 2024

ఇది మ‌రో ‘పూన‌మ్ పాండే స్టంట్‌’!

image

స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్ నివార‌ణ‌కు వ్యాక్సినేష‌న్‌పై 2024 బ‌డ్జెట్‌లో కేంద్రం ప్ర‌క‌ట‌న చేసింది. అనంతరం ఈ వ్యాధితో న‌టి పూన‌మ్ పాండే మృతి చెందిన‌ట్టు ఆమె టీం ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది. అయితే అదో స్టంట్‌గా తేలింది. అలాగే సంస్థలో ఉద్యోగుల ఒత్తిడిపై అవగాహ‌న కల్పించడానికే ఉద్యోగుల‌ తొల‌గింపు ప్ర‌క‌ట‌న చేశామ‌ని <<14840427>>Yes Madam<<>> ప్ర‌క‌టించింది. ఇది మ‌రో ‘పూనమ్ పాండే స్టంట్’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Similar News

News January 15, 2025

కోనసీమ ప్రభల తీర్థం గురించి తెలుసా?

image

AP: సంక్రాంతి వేడుకల్లో నిర్వహించే ప్రభల తీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది. కోనసీమలోని జగ్గన్నతోటలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. కనుమ రోజు ప్రభలను ఊరు దాటిస్తే మంచిదని స్థానికుల విశ్వాసం. కొన్ని వందల ఏళ్ల క్రితం జగ్గన్నతోటలోనే ఏకాదశ రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. అప్పటి నుంచి ప్రతి కనుమ రోజున వీటిని ఒకే చోట చేర్చుతారు. ఈ ప్రభలను తీసుకొచ్చే క్రమంలో యువకులు పొలాలు, వాగులు దాటుతూ ముందుకు సాగుతారు.

News January 15, 2025

కనుమ రోజున రథం ముగ్గు.. ఎందుకంటే?

image

కనుమ రోజున తెలుగు లోగిళ్లలో రథం ముగ్గు వేయడం ఆచారంగా ఉంది. దీని వెనుక పురాణగాథలు ఉన్నాయి. మనిషి శరీరం ఒక రథం అని, ఈ దేహమనే రథాన్ని నడిపేది దైవమని భావిస్తారు. సరైన దారిలో నడిపించమని కోరుతూ ఈ రకంగా ప్రార్థిస్తారు. పాతాళం నుంచి వచ్చిన బలిచక్రవర్తిని సాగనంపేందుకు రథం ముగ్గు వేస్తారని ఓ కథ. అయితే ఈ ముగ్గులు వీధిలోని ఇళ్లను కలుపుతూ వేయడం వల్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలనే సందేశాన్ని ఇస్తోంది.

News January 15, 2025

నేడు సుప్రీంకోర్టులో KTR క్వాష్ పిటిషన్ విచారణ

image

TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు విచారణ జరగనుంది. మరోవైపు రేపు కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నెల 9న ఆయనను ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తనపై కక్ష సాధింపుతోనే ఈ కేసు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు.