News December 13, 2024
మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరిగే మూడో టెస్టు కోసం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తమ తుది జట్టును ప్రకటించారు. గాయం నుంచి కోలుకున్న జోష్ హేజిల్వుడ్ ఈ మ్యాచ్లో ఆడతారని తెలిపారు. ప్లేయింగ్ XI: ఖవాజా, మెక్స్వీనీ, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, కమిన్స్ (C), మిచెల్ స్టార్క్, లయన్, జోష్ హేజిల్వుడ్. రేపు గబ్బాలో మూడో టెస్టు ప్రారంభం కానుంది.
Similar News
News January 22, 2025
AP & TGలో ఏడాదికి రూ.కోటి సంపాదించేవారు ఎంతంటే?
ఏడాదికి రూ.కోటి సంపాదించే వారు అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్-2024 డేటా ప్రకారం అక్కడ ఏకంగా 1,24,800 మంది కోటికి పైగా సంపాదిస్తున్నారు. అత్యల్పంగా లక్షద్వీప్లో కేవలం ఒకరు, లద్దాక్లో ముగ్గురు మాత్రమే రూ.1 కోటి అర్జిస్తున్నారు. ఇక ఏపీలో 5,340 మంది ఉండగా తెలంగాణలో 1,260 మంది ఉన్నారు.
News January 22, 2025
మీరే ప్రధాని అయితే..
USA అధ్యక్షుడైన తొలిరోజే ట్రంప్ సంతకాలతో సంచలనాలు సృష్టిస్తున్నారు. పుట్టుకతో పౌరసత్వం, WHO నుంచి USA ఎగ్జిట్, దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ సహా అనేక ముఖ్య నిర్ణయాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తున్నారు. ఈ సంతకాలపై USతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ‘ఒకే ఒక్కడు’లో ఒక్కరోజు CMలా, మీరు ఒక్కరోజు ప్రధానిగా ఒక్క నిర్ణయం అమలు చేసే అధికారం వస్తే ఏ ఫైలుపై సైన్ చేస్తారు? కామెంట్ చేయండి.
News January 22, 2025
తిలక్ వర్మ చరిత్ర సృష్టిస్తాడా?
టీమ్ ఇండియా క్రికెటర్ తిలక్ వర్మను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. రేపు ఇంగ్లండ్తో జరిగే తొలి టీ20లో సెంచరీ సాధిస్తే హ్యాట్రిక్ సెంచరీలు కొట్టిన ఏకైక క్రికెటర్గా చరిత్ర సృష్టిస్తారు. ఇప్పటికే సౌతాఫ్రికాపై వరుసగా రెండు టీ20ల్లో శతకాలు బాదారు. సూపర్ ఫామ్, మూడో స్థానంలో బరిలోకి దిగడం, మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం కావడంతో ఆయన ఈ రికార్డును చేరే ఛాన్స్ ఎక్కువగా ఉంది.