News June 12, 2024
గతంలో భూముల ధరల పెంపు ఇలా

TG: 2021-22లో వ్యవసాయ భూముల ఎకరం కనిష్ఠ ధరను ప్రభుత్వం ₹75వేలుగా నిర్ధారించింది. తక్కువ ధరలున్న చోట 50%, మధ్య స్థాయి ధరలున్న చోట 40%, ఎక్కువగా ఉన్న చోట 30% పెంచింది. ఖాళీ స్థలాలకు ధరలు తక్కువగా ఉన్న చోట 50%, మధ్య స్థాయిలో ఉంటే 40%, ఎక్కువగా ఉన్న చోట 30% పెంపు అమలు చేసింది. కొత్త మార్కెట్ విలువలను TG భూముల సవరణ మార్గదర్శకాలు-1998, సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు ఖరారు చేయనుంది.
Similar News
News December 9, 2025
ఒట్టేసి చెప్పు.. ఓటేస్తానని..!

TG: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను అభ్యర్థులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రాత్రుళ్లు పార్టీలు ఇస్తుండటంతో పాటు సిటీలో ఉద్యోగం చేసే వారికి కాల్ చేసి ఛార్జీలు ఇస్తాం రమ్మంటూ ఆఫర్ చేస్తున్నారు. అటు దండాలు పెడుతూ, కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పలు చోట్ల పిల్లలు, దేవుడిపై ఒట్లు వేయించుకొని మాట తీసుకుంటున్నారు. ఇతర అభ్యర్థులపై నిఘా పెట్టి వారికి పోటీగా ప్రమాణాలు చేస్తున్నారు, చేయిస్తున్నారు.
News December 9, 2025
నేడు పార్లమెంటులో SIRపై చర్చ

12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీ నిర్వహిస్తోన్న SIRపై ఇవాళ లోక్సభలో 10 గంటలపాటు చర్చ జరగనుంది. 12PMకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారు. సభ్యుల ప్రసంగాల తర్వాత కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సమాధానం ఇస్తారు. కాగా ఓట్ల చోరీ, ఎన్నికల కమిషన్ విధానాలు, BLOల ఆత్మహత్యలపై రాహుల్ ప్రశ్నించే అవకాశం ఉంది. సమగ్ర చర్చకు తాము సిద్ధమేనని ఎన్డీఏ కూడా చెబుతోంది.
News December 9, 2025
మచ్చలు పడుతున్నాయా?

చాలామంది మహిళలు తప్పు సైజు, నాణ్యత తక్కువగా ఉన్న లోదుస్తులను వాడతారు. దీని వల్ల కొన్నిసార్లు చర్మంపై మచ్చలు పడే అవకాశం ఉంది. వీటిని పోగొట్టడానికి కొన్ని ఇంటి చిట్కాలు. * స్పూన్ పంచదారలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి మర్దనా చేయాలి. * పాలు, బాదం నూనెలను కలిపి మచ్చలున్న ప్రాంతాల్లో రాయాలి. * పెరుగులో చిటికెడు పసుపు కలిపి, ఆ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న దగ్గర రాస్తే మార్పు కనిపిస్తుంది.


