News March 25, 2025

హుస్సైనీ మృతిపై పవన్ స్పందన ఇదే..

image

AP: తన గురువు <<15878066>>షిహాన్ హుస్సైనీ<<>> మృతిపై Dy.CM పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘హుస్సైనీ తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆయన వద్దే కరాటే శిక్షణ పొందాను. 4 రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి విదేశాల్లో మెరుగైన వైద్యం చేయిస్తానని తెలిపాను. ఈ నెల 29న వెళ్లి పరామర్శించాలనుకున్నాను. ఈలోపే ఇలా జరగడం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News March 28, 2025

IPL టికెట్ రూ.2343, పన్నులు రూ.1657!

image

IPL టికెట్ల ద్వారా మన ప్రభుత్వాలు క్రికెట్ అభిమానులను దోచేస్తున్నాయని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ ఆలోచింపజేస్తోంది. చెన్నైలో బేసిక్ టికెట్ ధర రూ.2343 ఉండగా ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ (25%) రూ.781 వేశారు. ఆ మొత్తంపై మళ్లీ 28 శాతం జీఎస్టీ వడ్డించారు. ఇందులో కేంద్రానికి 14 శాతం, రాష్ట్రానికి 14 శాతం వెళ్తుంది. రూ.4000లలో పన్నుల రూపంలోనే రూ.1657 తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 28, 2025

కొలికపూడి వ్యవహారంపై నివేదిక కోరిన టీడీపీ

image

AP: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై TDP అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అందరినీ కలుపుకుని వెళ్లాలని చెప్పినా ఆయనలో మార్పురాలేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 10 నెలలుగా తిరువూరులో జరిగిన ఘటనలపై నివేదిక ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్త, ఎంపీని ఆదేశించింది. తాజాగా టీడీపీ నేత రమేశ్ రెడ్డిపై అధిష్ఠానం చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని కొలికపూడి <<15904325>>హెచ్చరించిన<<>> విషయం తెలిసిందే.

News March 28, 2025

రూ.వేల కోట్లలో నల్లధనం బయటపడింది: మోదీ

image

2047 సంవత్సరంలో దేశం వికసిత్ భారత్‌గా ఎదిగిన నాడు అధికంగా లాభపడేది యువతేనని ప్రధాని మోదీ తెలిపారు. ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ అనే సదస్సులో మోదీ మాట్లాడారు. ED దాడులతో రూ.22,000 కోట్ల నల్లధనం బయటపడిందని తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్యంలో సవాళ్లు అధిగమించేందుకు IMAC ఏర్పాటవుతుందని, ఇది ఏషియా, యూరప్, మిడిల్ ఈస్ట్‌ను కలుపుతుందన్నారు. విపత్తుల సమయంలో దేశాలన్నీ కలసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

error: Content is protected !!