News February 24, 2025

వైసీపీ దివాళాకోరుతనానికి ఇది నిదర్శనం: సత్య కుమార్

image

AP: గవర్నర్ ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ సభాసంప్రదాయాలను వైసీపీ మంటగలిపిందని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని గుర్తించాలంటూ నినాదాలు చేయడం వైసీపీ దివాళాకోరుతనానికి నిదర్శనమని Xలో దుయ్యబట్టారు. ఆ పార్టీని ప్రతిపక్షంగా ప్రజలు గుర్తించలేదని, నాయకత్వాన్ని తిరస్కరించారని అన్నారు. ప్రజలు ఇవ్వని హోదాను బలవంతంగా పొందాలనుకోవడం వారి తీర్పును అవమానించడమేనని పేర్కొన్నారు.

Similar News

News March 23, 2025

బంగ్లాలో హిందువులపై ప్రణాళిక ప్రకారమే హింస: RSS

image

బంగ్లాలో హిందువులపై మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) ఆందోళన వ్యక్తం చేసింది. అఖిల భారతీయ ప్రతినిధి సభ(ABPS)లో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. ‘బంగ్లాలో హిందువులపై ప్రణాళికాబద్ధంగా హింసకు పాల్పడుతున్నారు. మైనారిటీలను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. ఇస్లామిస్ట్ శక్తుల చేతిలో మైనారిటీలు నరకాన్ని చూస్తున్నారు’ అని అందులో పేర్కొంది.

News March 23, 2025

ఇలాగే ఆడితే RCBదే కప్: పఠాన్

image

ఆర్సీబీ ‘ఈసాల కప్ నమ్దే’ కోరిక ఈసారి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘ఆర్సీబీకి మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. కచ్చితంగా టాప్-4లో ఉంటారు. ఫస్ట్ మ్యాచ్‌లో దక్కిన శుభారంభాన్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నా. కెప్టెన్ పాటీదార్ రిస్కులు తీసుకుంటున్నారు. అతనిలో నాకు నచ్చేది అదే’ అని పేర్కొన్నారు.

News March 23, 2025

మే నుంచి కొత్త పింఛన్లు: మంత్రి

image

AP: రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది కొత్తగా పింఛన్లకు అర్హులుగా ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. కొత్తగా 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మహిళల స్వయం సాధికారత, ఉపాధి కల్పన కోసం విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

error: Content is protected !!