News March 30, 2025
స్టార్క్కు టీ20ల్లో ఇదే తొలిసారి

మిచెల్ స్టార్క్ తొలిసారి టీ20ల్లో ఐదు వికెట్లు తీశారు. ఈ 35 ఏళ్ల ప్లేయర్ టెస్టుల్లో 15, వన్డేల్లో 9 సార్లు ఐదేసి వికెట్లు తీశారు. అయితే టీ20ల్లో 5 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఐపీఎల్-2025లో డీసీ తరఫున ఈ ఘనత సాధించారు. SRHతో మ్యాచులో కీలక వికెట్లు తీసి ఆ జట్టును తక్కువ పరుగులకే పరిమితం చేశారు.
Similar News
News November 13, 2025
యాదగిరిగుట్ట: ప్రొటోకాల్ దర్శనాలపై కీలక నిర్ణయాలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రొటోకాల్ దర్శనాలపై దేవస్థానం ఈవో వెంకట్రావు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. గురువారం దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రొటోకాల్ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న 3 రోజుల పాటు ఏజెంట్లు, రిఫరెన్స్ ఫోటో కాల్స్ పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.
News November 13, 2025
2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలు: CM

AP: రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్లో అనుమతి ఇచ్చామని, దీని ద్వారా 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని CM CBN చెప్పారు. ఇవాళ రూ.2.66 లక్షల కోట్ల పెట్టుబడులకు MoUలు జరిగాయని విశాఖ ఎకనమిక్ రీజియన్ సదస్సులో వెల్లడించారు. సంపద సృష్టి కోసం అందరం జట్టుగా పని చేశామని, 20 లక్షల ఉద్యోగాల హామీని నిరూపించామని పేర్కొన్నారు. 2047 నాటికి తలసరి ఆదాయం రూ.54 లక్షలకు పెంచడమే తమ లక్ష్యమన్నారు.
News November 13, 2025
ఆ ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తాం: అమిత్ షా

ఢిల్లీ పేలుడు నిందితులకు విధించే శిక్ష ప్రపంచానికి బలమైన సందేశం పంపుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మరోసారి అలాంటి అటాక్ చేయాలనే ఆలోచన కూడా రాకుండా శిక్షిస్తామన్నారు. ‘నిందితులపై తీసుకునే చర్యలతో భారత్ ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని సహించదని నిరూపిస్తాం. మెసేజ్ క్లియర్.. మనకు హాని కలిగించాలని ప్రయత్నించే వారు ఎవరైనా కఠిన పరిణామాలను ఎదుర్కొంటారు’ అని ఆయన హెచ్చరించారు.


