News December 3, 2024

బెస్ట్ బ్లెండెడ్ మాల్ట్ స్కాచ్ విస్కీ ఇదే!

image

ప్రతిష్ఠాత్మక న్యూయార్క్ వరల్డ్ స్పిరిట్స్ కాంపిటీషన్ (NYWSC)-2024లో షారుఖ్ ఖాన్, ఆర్యన్ ఖాన్ మద్దతు ఉన్న D’YAVOL విస్కీ సత్తా చాటింది. ప్రపంచంలోనే బెస్ట్ ఓవరాల్ స్కాచ్ & బెస్ట్ ఆఫ్ క్లాస్ విస్కీగా నిలిచింది. దీనిని విభిన్న పరిశ్రమలకు చెందిన నిపుణుల బృందం నిర్ణయిస్తుంది. దీనిపై D’YAVOL కో ఫౌండర్ షారుఖ్ ఖాన్ స్పందిస్తూ శ్రద్ధ, అభిరుచి, అంకితభావానికి నిదర్శనం అని తెలిపారు.

Similar News

News November 26, 2025

గుంటూరు యార్డులో ‘ఘాటైన’ ధరలు

image

గుంటూరు మిర్చి యార్డుకు బుధవారం 90 వేల బస్తాల ఏసీ సరుకు పోటెత్తింది. మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ‘యల్లో రకం’ మిర్చి ధర ఘాటెక్కింది. కిలో రూ.200 నుంచి రూ.250 వరకు పలికి రికార్డు సృష్టించింది. ముఖ్యమైన ధరలు (కిలోకు) 2043 ఏసీ: గరిష్ఠంగా రూ.200. నంబర్-5, 341 రకాలు రూ.180 వరకు, బంగారం, బుల్లెట్ రూ.175. తేజా ఏసీ రూ.120-152, ఇక సీడు తాలు రూ.60-90 వరకు ధర పలికాయి.

News November 26, 2025

‘పీఎం కుసుమ్’తో సాగులో సోలార్ వెలుగులు

image

TS: వచ్చే 4 ఏళ్లలో వ్యవసాయ బోర్లకు పెద్ద ఎత్తున సౌర విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. PM కుసుమ్ పథకం కింద వచ్చే నాలుగేళ్లలో 28.60 లక్షల బోర్లకు రాయితీలు, 4,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను రైతు సంఘాలతో ఏర్పాటుకు అనుమతివ్వాలని కేంద్రాన్ని TG ప్రభుత్వం కోరింది. అలాగే రైతులు తమ పొలాల్లో సొంతంగా ఏర్పాటు చేసుకునే సోలార్ ప్యానల్స్‌కు రాయితీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.

News November 26, 2025

ఇండోనేషియాలో తుఫాన్ బీభత్సం.. 8 మంది మృతి

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘సెన్‌యార్’ తుఫాన్ ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో బీభత్సం సృష్టిస్తోంది. అతిభారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో 8 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇవాళ రాత్రికి తుఫాన్ తీరం దాటనున్నట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు. మరోవైపు భారత్‌లోని తమిళనాడు, కేరళ, అండమాన్ & నికోబార్‌పై సెన్‌యార్ ప్రభావం చూపుతోంది. ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.