News October 5, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్

image

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 36 మంది మావోయిస్టులు హతమయ్యారు. CRPF, BSF, కోబ్రా, STF విభాగాలకు చెందిన 1500 మంది జవాన్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్ అని బస్తర్ IG పేర్కొన్నారు. 2026 కల్లా మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని కేంద్రమంత్రి అమిత్ షా ఇటీవలే స్పష్టంచేశారు.

Similar News

News October 5, 2024

ఖైదీల అసహజ మరణాలకు రూ.5 లక్షల పరిహారం

image

AP: జైళ్లలో ఖైదీలు మరణిస్తే ఇచ్చే పరిహారంపై రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఘర్షణ, జైలు సిబ్బంది వేధింపులతో ఖైదీ మరణిస్తే కుటుంబీకులకు రూ.5 లక్షలు అందిస్తారు. జైలు అధికారులు, వైద్యుల నిర్లక్ష్యంతో ఖైదీ చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా రూ.3.5 లక్షలు చెల్లిస్తారు. సహజ మరణం, అనారోగ్యం, తప్పించుకుని పారిపోయి చనిపోతే ఈ పరిహారం వర్తించదు. జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిబంధనలు రూపొందించారు.

News October 5, 2024

ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా పని చేస్తుందంటే?

image

TG: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వనుంది. రేషన్ షాప్‌కు వెళ్లి ఈ కార్డులోని QR కోడ్ స్కాన్ చేస్తే వారికి రేషన్ కార్డు ఉందా?ఉంటే ఎంత మంది ఉన్నారు? రేషన్ ఎంత ఇవ్వాలి? వంటి వివరాలు కనిపిస్తాయి. ఆస్పత్రికి వెళ్లి స్కాన్ చేస్తే ఆరోగ్యశ్రీకి అర్హులా? కాదా? అనేది తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ స్కీములు, RTC బస్సుల్లో పదే పదే ఆధార్ ఇవ్వడానికి బదులు దీనిని వాడుకోవచ్చు.

News October 5, 2024

బొగ్గు కన్నా LNGతోనే ఎక్కువ నష్టం

image

పర్యావరణ అనుకూల ఇంధనంగా భావించే LNG(లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్) గురించి ఓ షాకింగ్ రిపోర్టును కార్నెల్ వర్సిటీ(US) శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వంట, విద్యుత్ ఫ్యాక్టరీల్లో ఎక్కువగా వినియోగించే దీనివల్ల 20 ఏళ్లలో బొగ్గు కన్నా 33% ఎక్కువగా గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలైనట్లు తెలిపారు. కాగా మీథేన్‌తో తయారయ్యే సహజ వాయువులను LNGగా మార్చడానికి మైనస్ 105 డిగ్రీల సెల్సియస్‌కు చల్లబర్చాల్సి ఉంటుంది.