News May 11, 2024
ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఇదే(3/3)

లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీలో ఉన్నారు. విశాఖ లోక్సభలో అత్యధికంగా 33 మంది, రాజమండ్రిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీకి అత్యధికంగా 46 మంది, అత్యల్పంగా చోడవరం అసెంబ్లీకి ఆరుగురు పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో 79.84 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి 83 శాతం పోలింగ్ జరిగే అవకాశముందని అంచనా.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News April 3, 2026
GK: భారత విమానయాన పితామహుడు ఎవరు?

⋆ అతిపెద్ద విమానాశ్రయం: రాజీవ్ గాంధీ (శంషాబాద్, సుమారు 5,500 ఎకరాలు)
⋆ భారత విమానయాన పితామహుడు- JRD టాటా
⋆ తొలి విమాన ప్రయాణం: 1911, FEB 18 (అలహాబాద్-నైనీ)
⋆ తొలి విమానయాన సంస్థ: టాటా ఎయిర్లైన్స్
⋆ తొలి ఉమెన్ పైలట్: సరళా థక్రాల్
⋆ పౌర విమానయానాన్ని నియంత్రించే సంస్థ: డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)
⋆ ఎయిర్ పోర్టుల నిర్వహణను చూసే సంస్థ: ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)
News April 3, 2026
రేపటి నుంచి రబీ కొనుగోళ్లు.. 8 గంటల్లోనే ఖాతాల్లో డబ్బు: నాదెండ్ల

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ‘1,917 కేంద్రాల ద్వారా 23 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం. రైతుల కోసం 5.40 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచాం. 17,262 వాహనాలు అందుబాటులో ఉంటాయి. ధాన్యం కొనుగోలు చేసిన 8 గంటల్లోపే అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం’ అని SMలో పోస్టు చేశారు.
News April 3, 2026
‘వీరభద్రుడు’గా సూర్య.. రిలీజ్ ఎప్పుడంటే?

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ సినిమాకు తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్ ఖరారైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ను విడుదల చేసింది. ఇందులో సూర్య మీసం మెలేసి చేతిలో కత్తి పట్టుకొని ఉన్నారు. మే 14న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు.


