News May 2, 2024
2014, 19, 24 ఎన్నికలకు తేడా ఇదే: మోదీ

తాను 2014లో దేశ ఎన్నికల బరిలో నిలిచినప్పుడు ప్రజల్లో చాలా సందేహాలున్నాయని PM మోదీ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అప్పుడు నాకు అనుభవం లేదనుకున్నారు. కానీ ఏదో ఒకటి చేస్తానని నమ్మారు. నేను పడ్డ శ్రమ, తీసుకున్న నిర్ణయాల వల్ల 2019 నాటికి ప్రజల్లో ఆ నమ్మకం మరింత బలపడింది. 2024 వచ్చేసరికి అది కాస్తా గ్యారంటీగా మారింది. ఈ పని నేను కచ్చితంగా చేస్తా అని చెప్పే స్థితికి వచ్చా’ అని పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
క్రీడాకారులకు గ్రూప్-1 ఉద్యోగాలపై భిన్నాభిప్రాయాలు

మహిళా క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1, స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్కు డీఎస్పీ ఉద్యోగాలిచ్చి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గౌరవించాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కాకుండా స్పోర్ట్స్ కోటాలో వారికి ఉద్యోగాలివ్వడంపై పలువురు ఫైరవుతున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగానే ప్రభుత్వాల నిర్ణయాలని కొందరు సమర్థిస్తున్నారు.
News November 10, 2025
లైంగిక వేధింపులు ఎదురైతే..

బహిరంగ ప్రాంతాల్లో లైంగిక వేధింపులు ఎదురైతే వెంటనే సదరు వ్యక్తిపై జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయవచ్చు. అంటే ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. ఐపీసీ 354(ఎ), 354(డి), BNS సెక్షన్ 79 కింద కేసు నమోదు చేయవచ్చు. సెక్షన్ 354 కింద మహిళపై దాడికి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. సెక్షన్ 294 ప్రకారం మూడు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలి.
News November 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 62 సమాధానాలు

ప్రశ్న: శిఖండి ఎవరు? ఆమె భీష్ముడి చావునెందుకు కోరింది?
జవాబు: శిఖండి పూర్వజన్మలో కాశీ రాజకుమారి అంబ. ఆమె ఒకర్ని ప్రేమించి, వివాహం చేసుకోవాలి అనుకోగా.. భీష్ముడు బలవంతంగా తనను తీసుకెళ్లి వేరొకరికిచ్చి పెళ్లి చేశాడు. అప్పుడు ప్రతిజ్ఞ పూనిన అంబ మరుజన్మలో శిఖండిగా పుట్టి, యుద్ధంలో పాల్గొని, భీష్ముని చావుకు కారణమైంది.
☞ సరైన సమాధానం చెప్పినవారు: కృష్ణ, నల్గొండ.
<<-se>>#Ithihasaluquiz<<>>


