News May 2, 2024
2014, 19, 24 ఎన్నికలకు తేడా ఇదే: మోదీ

తాను 2014లో దేశ ఎన్నికల బరిలో నిలిచినప్పుడు ప్రజల్లో చాలా సందేహాలున్నాయని PM మోదీ చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అప్పుడు నాకు అనుభవం లేదనుకున్నారు. కానీ ఏదో ఒకటి చేస్తానని నమ్మారు. నేను పడ్డ శ్రమ, తీసుకున్న నిర్ణయాల వల్ల 2019 నాటికి ప్రజల్లో ఆ నమ్మకం మరింత బలపడింది. 2024 వచ్చేసరికి అది కాస్తా గ్యారంటీగా మారింది. ఈ పని నేను కచ్చితంగా చేస్తా అని చెప్పే స్థితికి వచ్చా’ అని పేర్కొన్నారు.
Similar News
News November 12, 2025
పేషంట్ మృతికి కారణమంటూ ఉమర్పై వేటు

ఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న డాక్టర్ <<18256986>>ఉమర్<<>> గురించి మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అనంత్నాగ్లోని ఆసుపత్రిలో ఉమర్ పనిచేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ పేషంట్ మృతికి కారణమయ్యాడని ప్రొఫెసర్ గులాం జీలాని తెలిపారు. షేషంట్ చావుబతుకుల్లో ఉంటే డ్యూటీ మధ్యలోనే వెళ్లిపోయాడని చెప్పారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఉమర్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
News November 12, 2025
నవంబర్ 12: చరిత్రలో ఈరోజు

1842: భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత జాన్ స్ట్రట్ జననం
1885: కొప్పరపు సోదర కవుల్లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ జననం
1896: విఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ జననం
1925: నృత్యదర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి జననం
1946: భారత స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యా మరణం (ఫొటోలో)
1996: హరియాణాలో రెండు విమానాలు ఢీకొని 350 మంది మృతి
News November 12, 2025
పాక్ కోర్టు ఆవరణలో దాడి మా పనే: జమాత్ ఉల్ అహ్రార్

పాకిస్థాన్లోని కోర్టు ఆవరణలో <<18258453>>పేలుడు<<>> తమ పనేనని నిషేధిత ఉగ్రవాద అనుబంధ సంస్థ జమాత్ ఉల్ అహ్రార్ ప్రకటించింది. పాకిస్థాన్లో చట్ట వ్యతిరేక తీర్పులు జారీ చేసే జడ్జిలు, లాయర్లు, అధికారులను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. దేశంలో ఇస్లామిక్ షరియా అమలులోకి వచ్చే వరకు దాడులు కొనసాగుతాయని హెచ్చరించింది. ఈ సంస్థ గతంలో TTP అనుబంధ సంస్థగా ఉంది.


