News August 5, 2024
అటు ప్రకృతి ప్రకోపం.. ఇటు దొంగల ప్రతాపం

ప్రకృతి విలయంతో విలవిల్లాడుతున్న వయనాడ్ ప్రజలకు కొత్తగా దొంగల బెడద పట్టుకుంది. వాలంటీర్ల రూపంలో దొంగలు చెలరేగిపోతున్నారని, విలువైన వస్తువులు ఎత్తుకెళ్తున్నారని బాధితులు వాపోతున్నారు. చూరల్మల, ముండక్కై గ్రామాల్లో కొండచరియలు విరిగిపడటంతో అధికారులు గ్రామస్థులను ఇళ్లు ఖాళీ చేయించి శిబిరాలకు తరలించారు. ఇదే అదనుగా కొందరు ఆ ఇళ్లను దోచుకుంటున్నారు. దీంతో వాలంటీర్లకు ఐడీ కార్డులు ఇవ్వడం ప్రారంభించారు.
Similar News
News November 26, 2025
Op సిందూర్.. పాక్ దాడిని తిప్పికొట్టిన CISF

Op సిందూర్ సమయంలో J&Kలోని LOC వద్ద ఉన్న ఉరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్పై పాకిస్థాన్ దాడికి యత్నించిందని CISF ఓ ప్రకటనలో తెలిపింది. డ్రోన్ల అటాక్ను తమ భద్రతా సిబ్బంది సమర్థంగా తిప్పికొట్టారని, పాక్ రేంజర్ల కాల్పుల నుంచి పౌరులను సురక్షితంగా కాపాడారని వెల్లడించింది. మే 6న రాత్రి శత్రు దేశంతో పోరాడిన 19 మంది సిబ్బందికి నిన్న ఢిల్లీలో అవార్డుల ప్రదానం సందర్భంగా CISF ఈ మేరకు వివరాలు వెల్లడించింది.
News November 26, 2025
ఏడాదికి లక్ష మంది అగ్నివీర్ల నియామకానికి ప్లాన్!

రాబోయే 4 ఏళ్లలో ఏడాదికి లక్ష మంది అగ్నివీర్లను నియమించుకోవాలని ఆర్మీ ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా 1.8 లక్షలుగా ఉన్న సైనిక కొరతను అధిగమించాలని భావిస్తోంది. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా 2022 నుంచి ప్రతి ఏడాది 45వేల నుంచి 50వేల మంది అగ్నివీర్లను ఆర్మీ నియమిస్తోంది. కరోనా కారణంగా 2020, 21లో రిక్రూట్మెంట్లు నిలిపివేయడం, అప్పుడే ఏడాదికి 60వేల నుంచి 65వేల మంది రిటైర్ కావడంతో సైనికుల కొరత ఏర్పడింది.
News November 26, 2025
3,058 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్వేలో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి NOV 29 వరకు ఛాన్స్ ఉంది. వయసు18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC,ST, PwBD, మహిళలకు రూ.250. www.rrbcdg.gov.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


