News April 25, 2024
‘ముస్లిం కోటా’ స్టోరీ ఇదే – 2/3
2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్లీ ఈ ప్రతిపాదన వచ్చింది. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా ఈ కోటా 4%కు తగ్గించాలని సూచించింది. 2010 మార్చి 25న ఈ 4% కోటా అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు ఆ 14 వర్గాలను EBC పరిధిలోకి తేవాలని ఆదేశించింది. మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ రెండోసారి గెలిచాక 2011లో మైనార్టీలకు ఓబీసీలో 8.4% సబ్ కోటా (ముస్లింలకు 6%) కల్పిస్తామని ప్రతిపాదించింది. <<-se>>#Elections2024<<>>
Similar News
News January 14, 2025
Stock Markets: లాభాల్లో పరుగులు..
స్టాక్మార్కెట్లు మోస్తరు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే సూచీలు ఎక్కువ పతనమవ్వడంతో ఇన్వెస్టర్లు ఆకర్షణీమైన షేర్లను కొనుగోలు చేస్తున్నారు. నిఫ్టీ 23,201 (+116), సెన్సెక్స్ 76,717 (+387) వద్ద ట్రేడవుతున్నాయి. FMC, IT షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, PSU బ్యాంకు, O&G షేర్లకు డిమాండ్ ఉంది. ADANIENT, NTPC, INDUSIND, TATAMOTORS, ADANIPORTS టాప్ గెయినర్స్.
News January 14, 2025
సంక్రాంతి.. ఆత్మీయులతో ఆనందంగా..
సంక్రాంతి పండగ పుణ్యాన అయినవాళ్లందరూ ఒక్కచోట చేరారు. రోజూ పనిలో బిజీగా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఏడాదికోసారి వచ్చే ఈ విలువైన సమయంలోనైనా కంప్యూటర్, ఫోన్, టీవీ అంటూ గడిపేయకండి. మీ పిల్లలను ఊళ్లో తిప్పండి. పెద్దవాళ్లను పరిచయం చేయండి. పంటపొలాలు చూపించండి. సంప్రదాయ ఆటలు ఆడండి. ఆత్మీయులతో మనసారా మాట్లాడుతూ ఆనందంగా గడపండి.
News January 14, 2025
ఎమ్మెల్యే కౌశిక్కు బెయిల్ మంజూరు
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయన రిమాండ్ రిపోర్టును జడ్జి కొట్టేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో గందరగోళం సృష్టించారని, ఎమ్మెల్యే సంజయ్ను దుర్భాషలాడారని 3 కేసులు నమోదు కాగా నిన్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు చేసి, కోర్టు ముందు హాజరుపరచగా జడ్జి బెయిల్ ఇచ్చారు. రూ.10 వేల చొప్పున 3 పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించారు.