News February 4, 2025
ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే జరిగేది ఇదే!

KBCలో రూ.5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ గుర్తున్నాడా? 2011లో ఈయన విజయం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. కానీ, ఆయన విజయం కొన్ని రోజుల్లోనే విషాదంగా మారింది. సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో ఆయన రోడ్డునపడ్డారు. అడిగిన వారికి డబ్బు ఇచ్చేయడం, ఆలోచించకుండా బిజినెస్ పెట్టి మొత్తం లాస్ అయ్యాడు. దీంతో భార్యతో తరచూ వాదనలు పెట్టుకొని ఆమెతోనూ విడిపోయాడు. మళ్లీ చదువుకొని ప్రస్తుతం టీచర్గా మారారు.
Similar News
News February 18, 2026
ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా?

చర్మ ఆరోగ్యం కోసం ఫేస్ ప్యాక్స్ వాడటం మంచిదే కానీ వాటిని తరచూ వాడితే చర్మం పొడిబారిపోతుందంటున్నారు నిపుణులు. అలాగే మార్కెట్లో కొని వాడే ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే ఆరిన వెంటనే శుభ్రం చెయ్యాలి. కొత్తరకం ఫేస్ ప్యాక్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ముఖం శుభ్రం చేసుకోకుండా ఫేస్ ప్యాక్ని అప్లై చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని గుర్తుంచుకోవాలి.
News February 18, 2026
ప్రకృతి సేద్యం.. APCNF ప్రధాన ఉద్దేశం ఇదే

వ్యవసాయాన్ని ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో, దీర్ఘకాలిక స్థిరత్వంతో సాగించే విధానంగా అభివృద్ధి చేయడమే APCNF లక్ష్యం. మొక్కకు కాదు, నేలకు ఆహారం అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఇది ముందుకు సాగుతోంది. ఘన, ద్రవ జీవామృతం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, అగ్నాస్త్రం సహా ఇతర సహజ సూక్ష్మపోషకాలను పంటలకు అందిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు చేరువ చేయడంలో APCNF కీలకపాత్ర పోషిస్తోంది.
News February 18, 2026
టెన్త్ పరీక్షల గ్యాప్లోనూ క్లాసులు!

TG: టెన్త్ పరీక్షల మధ్య గ్యాప్లో విద్యార్థులకు క్లాసులు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఎగ్జామ్స్ మధ్య 3-5 రోజుల వ్యవధి ఉండటంతో సూడెంట్లు స్కూలుకు రావాలని ఆదేశించారు. ఆయా రోజుల్లో 3 పీరియడ్ల చొప్పున క్లాసులు తీసుకోనున్నారు. మార్చి 14 నుంచి పరీక్షలు జరగనుండగా, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎక్కువ గ్యాప్ ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఆ గ్యాప్లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.


