News February 11, 2025

పేదలు ధనికులవ్వంది అందుకే: జాక్ మా

image

వ్యాపారం చేయాలని ఉన్నా.. చాలా మంది ఉద్యోగాలకే మొగ్గుచూపుతారు. అలాంటి వారిపై చైనీస్ బిలియనీర్ జాక్ మా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కోతి ముందు పండ్లు&డబ్బు పెడితే అవి పండ్లనే తీసుకుంటాయి. మనుషులు కూడా వ్యాపారానికి బదులు జాబ్‌కే జై కొడతారు. ఎందుకంటే జీతం కంటే వ్యాపారంలో ఎక్కువ డబ్బులు వస్తాయని తెలియదు. పేదలు.. పేదలుగా ఉండటానికి ఇదో కారణం’ అని చెప్పారు. గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరలవుతున్నాయి.

Similar News

News October 18, 2025

క్రికెటర్లకు అఫ్గాన్ క్రికెట్ బోర్డ్ నివాళి

image

పాక్ వైమానిక దాడుల్లో మరణించిన ముగ్గురు డొమెస్టిక్ క్రికెటర్లకు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు నివాళులర్పించింది. ‘పాక్ పిరికిపంద చర్యకు ఉర్గున్ జిల్లాకు చెందిన ముగ్గురు క్రికెటర్లను కోల్పోయాం. కబీర్, సిబ్గతుల్లా, హరూన్ మృతి మన స్పోర్ట్స్ కమ్యూనిటీకి తీరని లోటు. వీరి మృతికి గౌరవార్థం పాక్, శ్రీలంకతో జరగబోయే ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నాం. ఈ దాడిలో ఐదుగురు పౌరులు కూడా చనిపోయారు’ అని తెలిపింది.

News October 18, 2025

బనకచర్లపై స్టేటస్ తెలపాలని గోదావరి బోర్డు లేఖ

image

AP: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ వాస్తవ స్థితి తెలియజేయాలని గోదావరి బోర్డు రాష్ట్ర జలవనరుల శాఖకు లేఖ రాసింది. లింక్ ప్రాజెక్టుల ప్రతిపాదనలపై తెలంగాణ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు వివరణ ఇవ్వాలని కోరింది. ఇటీవల బనకచర్ల డీపీఆర్‌ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటీస్ ఇచ్చింది. దీనిపై TG జలవనరుల శాఖ అభ్యంతరం తెలుపుతూ బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News October 18, 2025

7,565 కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇంటర్ అర్హతతో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3రోజులే ఉంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. 18-25 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. <>వెబ్‌సైట్:<<>> https://ssc.gov.in/