News September 17, 2024
వైసీపీ వల్లే ఈ పరిస్థితి: చంద్రబాబు

AP: భవానీపురం రోడ్డు, బుడమేరులో ఊహించని వరద వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అసంపూర్తిగా పనులు వదిలేయడమే ఈ పరిస్థితికి కారణమని మీడియాతో చెప్పారు. 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే సమయంలో 40 మెట్రిక్ టన్నుల బరువున్న 3 బోట్లు బ్యారేజీ గేట్ కౌంటర్ వెయిట్ను ఢీకొట్టాయని చెప్పారు. ఇప్పటికీ వాటిని తీసేందుకు కష్టపడుతున్నట్లు తెలిపారు. ఆ ప్రభుత్వమే ఉంటే ఇంకా కోలుకునే వాళ్లం కాదన్నారు.
Similar News
News December 3, 2025
మీ బ్రెయిన్ ఏ గేర్ వేసింది..?

మన మెదడు 9, 32, 66, 83 వయస్సుల్లో లెవల్ షిఫ్ట్ అవుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. 0-9yrs: పరిసరాలు తెలుసుకోవడం. 9-32: పరిపక్వత దిశగా ప్రయాణం, భావోద్వేగాలు, పనితీరు, ఆలోచన శక్తి పెరుగుతాయి. గ్రాఫ్ వేస్తే.. 32Yrs పీక్ పర్ఫార్మెన్స్. 32-66: సెటిల్డ్, లిమిటేషన్స్ మెంటాల్టి. ప్రిడిక్టబుల్ థాట్స్. 66-83: మతిమరుపు, అనారోగ్యం, రిజర్వ్డ్ అవుతారు. 83- కొన్ని పనులు, ఆలోచనలే చేయగలరు.
News December 3, 2025
ఇతిహాసాలు క్విజ్ – 85 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: పాండురాజు మరణానికి గల కారణం ఏంటి?
సమాధానం: పాండురాజు వేటకు వెళ్లినప్పుడు, జింకలుగా భావించి కిందమ అనే మహామునిపై బాణం వేస్తాడు. దీంతో ఆ ముని మరణిస్తూ పాండురాజు తన భార్యతో కలిసిన తక్షణమే మరణిస్తాడని శపిస్తాడు. ఈ శాపం కారణంగా, ఒకరోజు మాద్రితో కలిసినప్పుడు పాండురాజు తక్షణమే మరణించారు. దాంతో మాద్రి సహగమనం చేసింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 3, 2025
T20 వరల్డ్ కప్కి టీమ్ ఇండియా జెర్సీ రిలీజ్

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించిన టీమ్ ఇండియా జెర్సీని బీసీసీఐ రిలీజ్ చేసింది. రాయ్పూర్లో SAతో జరుగుతున్న రెండో వన్డే ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో రోహిత్ శర్మ, తిలక్ వర్మ ఈ జెర్సీలను అన్వెయిల్ చేశారు. ‘టీమ్కు ఎప్పుడూ నా బెస్ట్ విషెస్ ఉంటాయి’ అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 7నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది.


