News January 25, 2025
‘పద్మ’ అవార్డులు ఈ రాష్ట్రానికే అత్యధికం

కేంద్రంలో ప్రకటించిన 139 ‘పద్మ’ అవార్డుల్లో అత్యధికంగా మహారాష్ట్ర(14)కు వరించాయి. ఆ తర్వాతి స్థానాల్లో యూపీ నుంచి 10 మంది, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నుంచి 9 మంది చొప్పున, బిహార్, గుజరాత్ నుంచి 8 మందికి ఈ పురస్కారాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి 5, తెలంగాణ నుంచి ఇద్దరికి దక్కాయి. అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున ఈ అవార్డులకు ఎంపికయ్యారు.
Similar News
News February 15, 2025
రాహుల్ గాంధీకి కులం లేదు, మతం లేదు: బండి సంజయ్

TG: ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, దేశం లేదు అంటూ విరుచుకుపడ్డారు. ‘రాహుల్ తాత పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ. తల్లి సోనియా గాంధీ క్రైస్తవురాలు, ఇటలీ దేశస్థురాలు. రాహుల్ కులం మీద రేవంత్ ఏం సమాధానం చెప్తారు’ అని ప్రశ్నించారు.
News February 15, 2025
త్వరలో కాంగ్రెస్ నుంచి రేవంత్ బహిష్కరణ.. ఎర్రబెల్లి సంచలన కామెంట్స్

Tకాంగ్రెస్లో ముసలం ముదురుతోందని, త్వరలో రేవంత్ రెడ్డిని ఆ పార్టీ నుంచి బహిష్కరించబోతున్నారని BRS నేత ఎర్రబెల్లి దయాకర్ సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్పై 25 మంది MLAలు అసంతృప్తితో ఉన్నారన్నారు. మున్షీని ఆయన మేనేజ్ చేస్తున్నారనే అధిష్ఠానం ఇన్ఛార్జ్ని మార్చిందని ఆరోపించారు. త్వరలో తనను కూడా పీకేస్తారనే భయంతోనే రేవంత్ ఢిల్లీ వెళ్లి రాహుల్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
News February 15, 2025
పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రియా బెనర్జీ

బాలీవుడ్ హీరో ప్రతీక్ బబ్బర్, హీరోయిన్ ప్రియా బెనర్జీ పెళ్లి చేసుకున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా వీరు ఒక్కటయ్యారు. ప్రతీక్కు ఇది రెండో వివాహం కాగా ప్రియాకు మొదటిది. వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ ఇప్పుడు పెళ్లి పీటలెక్కారు. కాగా ప్రియా బెనర్జీ ‘జోరు’, ‘అసుర’, ‘కిస్’ తదితర సినిమాలతోపాటు ‘రానానాయుడు’ వెబ్ సిరీస్లోనూ నటించారు. ప్రస్తుతం బాలీవుడ్లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు.