News November 18, 2024

ఆ 60 వేల మందే పునాదిరాయి: మోదీ

image

నైజీరియాలో ఉన్న 60 వేల మంది భార‌తీయులు ఇరు దేశాల మ‌ధ్య బ‌ల‌మైన బంధాల‌కు పునాదిరాయిగా నిలుస్తున్నార‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. వారి రక్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ందుకు అక్క‌డి ప్ర‌భుత్వానికి మోదీ కృతజ్ఞ‌త‌లు తెలిపారు. నైజీరియాతో స్ట్రాటజిక్ రిలేష‌న్స్‌కు భార‌త్ అధిక ప్రాధాన్యం ఇస్తుంద‌ని పేర్కొన్నారు. భార‌త ప్ర‌ధాని 17 ఏళ్ల త‌రువాత ఆ దేశంలో ప‌ర్య‌టించ‌డం ఇదే మొద‌టిసారి.

Similar News

News December 6, 2025

హనుమాన్ చాలీసా భావం – 30

image

సాధు సంత కే తుమ రఖవారే|
అసుర నికందన రామ దులారే||
ఆంజనేయుడు సాధువులకు, సత్పురుషులకు, మంచివారికి ఎప్పుడూ రక్షకుడిగా ఉంటాడు. ఆయన రాక్షసుల సమూహాన్ని నాశనం చేసి, లోకానికి శాంతిని కలిగిస్తాడు. శ్రీరాముడికి చాలా ప్రియమైనవాడు. ఈ గుణాల కారణంగానే హనుమంతుడు అపారమైన శక్తితో, భక్తితో ఈ ప్రపంచంలో అందరిచేత పూజలందుకుంటున్నాడు. <<-se>>#HANUMANCHALISA<<>>

News December 6, 2025

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులకు అప్లై చేశారా?

image

ముంబైలోని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 20 ఆక్చువేరియల్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు IAI/IFoA నిర్వహించే పరీక్షలో కనీసం 2 యాక్చురియల్ సబ్జెక్టులలో ఉత్తీర్ణులై ఉండాలి. 21 నుంచి 27ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.40వేలు స్టైపెండ్ చెల్లిస్తారు.

News December 6, 2025

వంటింటి చిట్కాలు

image

*వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలంటే.. వాటిని పెనం మీద వేసి కొద్దిసేపు వేడి చేయాలి. ఇలా చేస్తే పొట్టు ఈజీగా వస్తుంది.
*కర్రీలో పులుపు మరీ ఎక్కువగా ఉంటే బెల్లం లేదా ఉప్పు కలిపి చూడండి. ఇక్కడ ఉప్పును రుచి చూసి కలుపుకోవాలి.
* కాకరకాయ కూర వండేటప్పుడు కాస్త నిమ్మరసం వేస్తే చేదు తగ్గుతుంది.
* పకోడీలు కరకరలాడుతూ రావాలంటే పిండి కలిపేటప్పుడే ఒక చెంచా మరుగుతున్న నూనె కలపాలి.