News November 18, 2024

ఆ 60 వేల మందే పునాదిరాయి: మోదీ

image

నైజీరియాలో ఉన్న 60 వేల మంది భార‌తీయులు ఇరు దేశాల మ‌ధ్య బ‌ల‌మైన బంధాల‌కు పునాదిరాయిగా నిలుస్తున్నార‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. వారి రక్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ందుకు అక్క‌డి ప్ర‌భుత్వానికి మోదీ కృతజ్ఞ‌త‌లు తెలిపారు. నైజీరియాతో స్ట్రాటజిక్ రిలేష‌న్స్‌కు భార‌త్ అధిక ప్రాధాన్యం ఇస్తుంద‌ని పేర్కొన్నారు. భార‌త ప్ర‌ధాని 17 ఏళ్ల త‌రువాత ఆ దేశంలో ప‌ర్య‌టించ‌డం ఇదే మొద‌టిసారి.

Similar News

News November 28, 2025

విశాఖ: రూ.కోట్లలో మోసానికి పాల్పడ్డ కానిస్టేబుల్!

image

విశాఖలో క్రిప్టో కరెన్సీ కలకలం రేపింది. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ రూ.3లక్షలు పెడితే నెలకు రూ.50 వేలు వస్తాయని నమ్మించి రూ.కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది పోలీసులు లాభాలు వస్తాయని నమ్మి మోసపోయినట్లు సమాచారం. ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ వద్ద ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

News November 28, 2025

4 వారాలుగా అనుమతించట్లేదు: ఇమ్రాన్ ఖాన్ సోదరి

image

జైలులో ఉన్న తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్‌ను 4 వారాలుగా కలవనివ్వట్లేదని సోదరి నొరీన్ నియాజీ తెలిపారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన నెలకొందన్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. జైలు అధికారులు ఏం చెప్పట్లేదు. మా సోదరుడిని చంపేసినట్లు వార్తలొస్తున్నాయి’ అని వాపోయారు. అంతకుముందు ఖైబర్‌ పఖ్తుంఖ్వా CM సోహైల్ రావల్పిండిలోని జైలు ముందు బైఠాయించి ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిరసన తెలిపారు.

News November 28, 2025

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసా?

image

అండాశయం (ఓవరీస్‌) నుంచి అండం గర్భసంచిలోకి వచ్చేలా తోడ్పడే ట్యూబ్స్‌ను ‘ఫెలోపియన్‌ ట్యూబ్స్‌’ అంటారు. కొన్ని సందర్భాల్లో పిండం గర్భసంచిలో బదులు ఈ ఫెలోపియన్‌ ట్యూబుల్లో పెరగడంతోపాటు ఒక్కోసారి అండాశయాల్లో (ఓవరీస్‌), కాస్తంత కిందికి వస్తే గర్భాశయ ముఖద్వారంలో, ఒక్కోసారి కడుపులో కూడా పెరగవచ్చు. ఈ సమస్యనే ‘ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ’గా వ్యవహరిస్తారు. దీనివల్ల కొన్నిసార్లు తల్లికి ప్రాణాపాయం సంభవిస్తుంది.