News November 18, 2024
ఆ 60 వేల మందే పునాదిరాయి: మోదీ

నైజీరియాలో ఉన్న 60 వేల మంది భారతీయులు ఇరు దేశాల మధ్య బలమైన బంధాలకు పునాదిరాయిగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వారి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నందుకు అక్కడి ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. నైజీరియాతో స్ట్రాటజిక్ రిలేషన్స్కు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. భారత ప్రధాని 17 ఏళ్ల తరువాత ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి.
Similar News
News April 16, 2026
మహిళలకు LSలో 272 సీట్లు: కేంద్ర మంత్రి

ఉమెన్ రిజర్వేషన్ల అమలు ద్వారా లోక్సభలో మహిళలకు 272 సీట్లు రిజర్వు అవుతాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటించారు. డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లులను ఆయన LSలో ప్రవేశపెట్టారు. ‘LS స్థానాలు 543 నుంచి గరిష్ఠంగా 850కి పెరుగుతాయి. ఇందులో రాష్ట్రాల నుంచి 815, UTల నుంచి 35 ఉంటాయి. రాష్ట్రాల్లో 50% చొప్పున సీట్లు పెరుగుతాయి. స్త్రీలకు 272 దక్కుతాయి. ఇవి 33%కి సమానం’ అని తెలిపారు.
News April 16, 2026
‘కంకణం కట్టుకోవడం’ వెనుక ఎంతో అర్థం

ఒక పనిని కచ్చితంగా, దృఢ సంకల్పంతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పే సందర్భంలో ‘కంకణం కట్టుకోవడం’ అనే జాతీయాన్ని వాడతాం. పెళ్లిళ్లు, శుభకార్యాలు, యజ్ఞాలు, వ్రతాలకు ముందు మణికట్టుకు కంకణ ధారణ చేస్తారు. ఇది మూడు/ఐదు పోగులతో ఉంటుంది. దీన్ని మామిడాకు/తమలపాకు/పసుపుకొమ్ముతో అలంకరిస్తారు. ఇలా చేస్తే ఆ కార్యం విజయవంతంగా పూర్తయ్యేందుకు సర్వేశ్వరుడు రక్షణగా ఉంటారని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>
News April 16, 2026
కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.


