News August 13, 2025

E20 పెట్రోల్‌పై ఆ ప్రచారాలు తప్పు: కేంద్రం

image

E20 పెట్రోల్‌పై వస్తున్న <<17378231>>పుకార్లను<<>> కేంద్రం కొట్టిపారేసింది. దీని వల్ల పొల్యూషన్ తగ్గడమే కాకుండా వాహనాల పికప్ కూడా పెరుగుతుందని వెల్లడించింది. E10 పెట్రోల్‌తో పోలిస్తే 30% తక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువడతాయని పేర్కొంది. మైలేజీ తగ్గుతుందన్న ప్రచారంలో నిజం లేదంది. డ్రైవింగ్ విధానం, వాహనం మెయింటెనెన్స్, టైర్ ప్రెషర్, AC లోడ్ వంటి వాటిపై మైలేజీ ఆధారపడి ఉంటుందని కేంద్రం వివరించింది.

Similar News

News August 13, 2025

నేడు ED విచారణకు మంచు లక్ష్మి

image

TG: సినీ నటి మంచు లక్ష్మి నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో మంచు లక్ష్మికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. నగదు లావాదేవీలు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో సంబంధాలపై ఆమెను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానాను అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

News August 13, 2025

జాగ్రత్త.. నేటి నుంచే అతి భారీ వర్షాలు!

image

బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ఇరు రాష్ట్రాల అధికారులు ముందస్తు చర్యల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు, రాత్రి నుంచే పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది?

News August 13, 2025

ఈ జిల్లాల్లో స్కూళ్లకు 5 రోజులు సెలవులు

image

TG: భారీ వర్షసూచన నేపథ్యంలో హన్మకొండ, WGL, జనగామ, MHBD, యాదాద్రి జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ, రేపు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ జిల్లాల్లో 15న స్వాతంత్ర్య దినోత్సవం, 16న కృష్ణాష్టమి, 17న సండేతో కలిపి 5రోజులు వరుస సెలవులు రానున్నాయి. అటు, GHMC ఏరియాలో భారీ వర్షం పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఇళ్లకు చేరేందుకు అవస్థలు పడకుండా స్కూళ్లను ఉదయం ఒకపూటే నడపాలని ఆదేశాలు జారీ అయ్యాయి.