News May 11, 2024
బయటి ప్రాంతాల వారు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలి: సీఈవో ముకేశ్

AP: సా.6 గంటల తర్వాత అన్నిరకాల ప్రచారం ఆగిపోవాల్సిందేనని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. బయటి ప్రాంతాల వారు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పారు. రేపు సాయంత్రానికి సిబ్బంది పోలింగ్ బూత్లకు చేరుకుంటారని తెలిపారు. ఎల్లుండి ఉ.7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


