News October 8, 2024
బఫర్ జోన్లో ఉన్నవి కూల్చడం లేదు: భట్టి

TG: మూసీ సుందరీకరణలో భాగంగా నదీ గర్భంలోని నిర్మాణాలనే తొలగిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. మూసీ పరిరక్షణ, చెరువుల ఆక్రమణలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో పూర్తిగా 44, పాక్షికంగా 127 చెరువులు కబ్జాకు గురైనట్లు వెల్లడించారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50లక్షల కోట్లు అనే వార్తలను ఆయన కొట్టిపారేశారు.
Similar News
News November 24, 2025
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే క్రిమినల్ కేసులు

TG: ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అమ్మితే లబ్ధిదారులపై POT యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హౌసింగ్ కార్పొరేషన్ MD పీవీ గౌతమ్ తెలిపారు. అలాంటి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఇళ్లు అద్దెకు ఇచ్చినా రద్దు చేస్తామని పేర్కొన్నారు. GHMCలో ఇప్పటికే సర్వే చేశామని, త్వరలో జిల్లాల్లోనూ సర్వే చేస్తామన్నారు. కొల్లూరు, రాంపల్లిలో ₹20L-50Lకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
News November 24, 2025
నరదృష్టిని తొలగించే స్తోత్రం

కాళికే పాపహరిణి దృష్టిదోష వినాశిని ।
శత్రు సంహారిణి మాతా రక్ష రక్ష నమోస్తుతే ॥
మనపై, మన ఇల్లు, వ్యాపారం వంటి వాటిపై ఇతరుల చెడు దృష్టి పడినప్పుడు, ఆ దృష్టి దోషాల నివారణ కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తారు. శత్రు భయం, నెగటివ్ ఆలోచనల నుంచి ఇది మనల్ని విముక్తుల్ని చేస్తుంది. రోజూ పఠిస్తే.. ఆటంకాలు తొలగిపోయి, అమ్మవారి రక్షణ ఎప్పుడూ ఉంటుందని, జీవితం సుఖశాంతులతో సాగుతుందని పండితులు చెబుతున్నారు.
News November 24, 2025
నేడు కొత్త CJI ప్రమాణ స్వీకారం.. తొలిసారి విదేశీ అతిథుల రాక

53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(CJI)గా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని ప్రెసిడెంట్ భవన్లో రాష్ట్రపతి ముర్ము ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి భూటాన్, కెన్యా, మలేషియా, మారిషస్, SL, నేపాల్ దేశాల చీఫ్ జస్టిస్లు హాజరుకానున్నారు. CJI ప్రమాణ స్వీకారానికి విదేశీ అతిథులు రావడం ఇదే తొలిసారి. కాగా CJIగా బాధ్యతలు చేపట్టిన తొలి హరియాణా వ్యక్తిగా సూర్యకాంత్ నిలవనున్నారు.


