News October 8, 2024
బఫర్ జోన్లో ఉన్నవి కూల్చడం లేదు: భట్టి
TG: మూసీ సుందరీకరణలో భాగంగా నదీ గర్భంలోని నిర్మాణాలనే తొలగిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. మూసీ పరిరక్షణ, చెరువుల ఆక్రమణలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో పూర్తిగా 44, పాక్షికంగా 127 చెరువులు కబ్జాకు గురైనట్లు వెల్లడించారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50లక్షల కోట్లు అనే వార్తలను ఆయన కొట్టిపారేశారు.
Similar News
News October 8, 2024
FLASH: లీడింగ్లో వినేశ్ ఫొగట్
భారత మాజీ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ లీడింగ్లో ఉన్నారు. హరియాణాలోని జులానా నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఆమె రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించి ఇటీవల కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్ సింగ్ సైతం గర్హి సంప్లాలో ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 46 కాగా కాంగ్రెస్ 54 సీట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
News October 8, 2024
అందరి చూపు ఆ ఇద్దరిపైనే.. గెలుస్తారా?
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. 90 సెగ్మెంట్లకు 1,031 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా దేశం మొత్తం ఇద్దరి ఫలితం కోసం ఎదురుచూస్తోంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఎంతో ఆదరణ పొందిన రెజ్లర్ వినేష్ ఫొగట్ జులానా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. మరొకరు భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ దీపక్ హుడా. ఈయన మెహమ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.
News October 8, 2024
UAE నుంచి భారత్కు $100bns పెట్టుబడులు: పీయూష్ గోయల్
రాబోయే సంవత్సరాల్లో UAE నుంచి $100bns పెట్టుబడులను భారత్ ఆకర్షిస్తుందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డేటా సెంటర్లు, AI, రెన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రా రంగాల్లోకి గణనీయంగా పెట్టుబడులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రోత్సాహకంగా వారికి ఉచితంగా భూములు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఈక్విటీల్లో UAE ప్రత్యక్ష పెట్టుబడులు $20bnsగా ఉన్నాయి. 2023లోనే $3bns వచ్చాయి.