News October 8, 2024
బఫర్ జోన్లో ఉన్నవి కూల్చడం లేదు: భట్టి

TG: మూసీ సుందరీకరణలో భాగంగా నదీ గర్భంలోని నిర్మాణాలనే తొలగిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. మూసీ పరిరక్షణ, చెరువుల ఆక్రమణలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో పూర్తిగా 44, పాక్షికంగా 127 చెరువులు కబ్జాకు గురైనట్లు వెల్లడించారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50లక్షల కోట్లు అనే వార్తలను ఆయన కొట్టిపారేశారు.
Similar News
News December 16, 2025
సిడ్నీ దాడి.. నిందితులకు హైదరాబాద్ లింక్!

ఆస్ట్రేలియాలో కాల్పులకు తెగబడిన <<18568131>>తండ్రీకొడుకుల<<>> మూలాలు హైదరాబాద్లో ఉన్నాయి. ‘సాజిద్ అక్రమ్(50)ది ఓల్డ్ సిటీ. ఇద్దరు సోదరులు, బంధువులు అక్కడే ఉన్నారు. 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డాడు. ఆస్తి పంపకాల కోసం గతంలో ఇండియాకు వచ్చాడు. అతడి కొడుకు నవీద్కు పుట్టుకతో ఆసీస్ పౌరసత్వం ఉంది’ అని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇండియాతో ఆస్ట్రేలియా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పాయి.
News December 16, 2025
IPL.. పతిరణకు రూ.18 కోట్లు

శ్రీలంక యంగ్ బౌలర్ మతీశా పతిరణను రూ.18 కోట్లకు KKR కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఇతడి కోసం ఢిల్లీ, లక్నో పోటీ పడ్డాయి. డెత్ ఓవర్లలో యార్కర్లు వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించడం పతిరణ స్పెషల్. ఇతడు గతంలో చెన్నై తరఫున ఆడారు. సౌతాఫ్రికా బౌలర్ నోర్జ్ను లక్నో రూ.2 కోట్లకు దక్కించుకుంది. అటు భారత స్పిన్నర్ రాహుల్ చాహర్ను ఎవరూ కొనుగోలు చేయలేదు.
News December 16, 2025
ఏపీపీ పోస్టులకు ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?

AP: 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్ 19 నుంచి 22 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ రాజీవ్కుమార్ మీనా తెలిపారు.


