News April 1, 2025

ఆ భూములు అటవీ శాఖ పరిధిలోనివి: బండి

image

TG: కంచ గచ్చిబౌలి భూముల అమ్మకం కాంగ్రెస్ ప్రభుత్వ అవకాశవాదమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వం వేలం వేయాలనుకున్న ఆ 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోకి వస్తుందన్నారు. కేంద్రం ఆమోదం లేకుండా అడవులను నరికివేయడం కుదరదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని గుర్తుచేశారు. ఈ భూమికి సంబంధించిన కేసు హైకోర్టులో నడుస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా ఉందని మండిపడ్డారు.

Similar News

News April 18, 2025

మెలోనీ అంటే నాకు చాలా ఇష్టం: ట్రంప్

image

ఇటలీ PM జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని ట్రంప్ తెలిపారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని అని, వ్యక్తిగతంగానూ ఆవిడతో మంచి అనుబంధం ఉందన్నారు. ఆవిడలో చాలా ప్రతిభ ఉందని, ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరంటూ కొనియాడారు. టారిఫ్స్ పెంపుపై US వైఖరిని మెలోనీ వ్యతిరేకించినా.. యూరోపియన్ దేశాల నుంచి ట్రంప్‌ని కలిసిన తొలి ప్రధాని ఆవిడే.

News April 18, 2025

IPL: అనూహ్య ‘నో బాల్’.. ఎలాగంటే?

image

నిన్న MI, SRH మ్యాచ్‌లో ఓ అనూహ్య నో బాల్ వెలుగులోకి వచ్చింది. అన్సారీ బౌలింగ్‌లో రికెల్టన్ షాట్ ఆడగా కమిన్స్ క్యాచ్ పట్టారు. అయితే, బ్యాటర్ ఔట్ కాలేదు. దీనికి కారణం నో బాల్. రూల్ ప్రకారం బ్యాట్‌ను బంతి తాకక ముందే కీపర్ గ్లౌవ్స్ స్టంప్స్ కంటే ముందుకొస్తే నో బాల్ ఇస్తారు. నిన్న క్లాసెన్ గ్లౌవ్స్ ఇలాగే ముందుకొచ్చాయి. అయితే, కీపర్ తప్పునకు బౌలర్‌కు శిక్ష ఏంటని పలువురు క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.

News April 18, 2025

సినిమాలు వదిలేస్తున్నట్లు ప్రచారం.. డైరెక్టర్ బూతు పురాణం!

image

తాను సినిమాలు తీయడం మానేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఖండించారు. ‘నేను ఫిల్మ్ మేకింగ్‌ను వదిలేయట్లేదు. షారుఖ్ ఖాన్ కంటే బిజీగా ఉన్నా. 2028 వరకు డేట్స్ ఖాళీ లేవు. 5 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నా. త్వరలోనే రిలీజ్ అవుతాయి. నేను నిరాశతో ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయానని అనుకునే వాళ్లందరూ మీది మీరు..’ అంటూ అసభ్య పదజాలంతో <>ట్వీట్<<>> చేశారు.

error: Content is protected !!