News November 30, 2024
రెండో టెస్టులో ఆ ముగ్గురిపై వేటు పడొచ్చు: గవాస్కర్

డిసెంబర్ 6 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్టులో రోహిత్ శర్మ, గిల్, రవీంద్ర జడేజా ఎంట్రీ ఖాయమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్, ఫస్ట్ డౌన్లో గిల్ బ్యాటింగ్ చేస్తారన్నారు. పడిక్కల్, జురెల్, వాషింగ్టన్ సుందర్ బెంచ్కు పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Similar News
News November 24, 2025
పల్నాడు జిల్లా భవితవ్యం పై ఉత్కంఠ.!

జిల్లాల పునర్విభజన కసరత్తు తుది దశకు వచ్చిన నేపథ్యంలో పల్నాడు జిల్లా భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పడనున్న అమరావతి జిల్లా పరిధిలోకి చేర్చాలనే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో పులిచింతల, ధ్యాన బుద్ధ, అమరావతి టెంపుల్ వంటి కీలక ప్రాంతాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు నేడు జిల్లాల పునర్ విభజనపై అధికారులతో సమీక్షించనున్న క్రమంలో ఆసక్తి నెలకొంది.
News November 24, 2025
ముగిసిన G20 సమ్మిట్.. చర్చించిన అంశాలివే..

సౌతాఫ్రికాలో జరిగిన G20 సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. 20దేశాలకు చెందిన దేశాధినేతలు ఇందులో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా దేశాల మధ్య యుద్ధ వాతావరణాలను తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులు, మైనింగ్, టెక్నాలజీ, AI సాంకేతికతలో పరస్పరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపైనా చర్చించారు.
News November 24, 2025
గొప్ప జీవితం అంటే ఏంటి?

‘గొప్ప జీవితం’ అంటే డబ్బు సంపాదించడమో, భోగాలు అనుభవించడమో, ధనవంతులుగా కీర్తి సంపాదించడమో కాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ధర్మబద్ధంగా జీవించడమే దేవుడిచ్చిన జన్మకు సార్థకమంటున్నాయి. ఈ సత్యాన్నే మన రామాయణ మహాభారత గాథలు లోకానికి చాటిచెప్పాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు కేవలం గొప్పవారు కావాలని చెబుతుంటారు. అందుకు బదులుగా ధర్మ బుద్ధి కలిగి ఉండాలని కోరుకోవాలి. అవే శాశ్వతమైన ఆనందాన్ని, విలువను ఇస్తాయి.


